పలు డిమాండ్లపై పీహెచ్సీ వైద్యుల ఆందోళన…

  • మండల వైద్యాధికారి ఎస్ ఎస్ రాజీవ్ కుమార్ పిలుపు…

శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): ఆంధ్ర ప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్స్ అసోసియేషన్ ( ఏపిపిహెచ్సి డిఏ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యులు తమ హక్కుల సాధన కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెల 26వ తేదీ నుంచి దశల వారీగా నిరసనలు కొనసాగనున్నాయి. అసోసియేషన్ తరఫున విడుదల చేసిన ప్రకటనలో వైద్యులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ – ఈ ఆందోళనతో కొంత అసౌకర్యం కలిగినా, అది ప్రజల వ్యతిరేకంగా కాదని, గ్రామీణ వైద్య సేవల భవిష్యత్తు కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ పోరాటం జరుగుతోందని స్పష్టం చేశారు. సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 26న ఆన్లైన్ రిపోర్టింగ్ సేవలు బంద్ చేయబడతాయి. 27న స్వస్థ నారీ కార్యక్రమం, 104 సంచార చికిత్స సేవలు నిలిపివేయబడతాయి. 28న అధికారిక వాట్సాప్ గ్రూప్ బహిష్కరించనున్నారు. 29న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలు నిలిపివేయబడతాయి. 30న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబర్ 1న జిల్లా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యులు విజయవాడలో నిరసనకు దిగుతారు. ఇందులో భాగంగా నాయకులు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. వైద్యుల ప్రధాన డిమాండ్లలో జివో 99 ద్వారా రద్దు చేసిన ఇన్ సర్వీస్ పిజి కోటా పునరుద్ధరణ, సమయానికి ప్రమోషన్లు ఇవ్వడం, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు ట్రైబల్ అలవెన్స్, 104/సంచార చికిత్స సేవలకు ప్రత్యేక అలవెన్స్, నొషనల్ ఇన్క్రిమెంట్ ఇవ్వడం ఉన్నాయి. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ ఎస్ ఎస్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య హక్కుల కోసం మేము కట్టుబడి ఉన్నాము. కానీ డాక్టర్లకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లేకపోతే గ్రామీణ వైద్య సేవలు కుంటుపడతాయి. మా డిమాండ్లు న్యాయమైనవే. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలి. మేము ప్రజలకు ఇబ్బంది కలిగించడానికి కాదు, సేవలను మెరుగుపరచడానికి ఈ పోరాటం చేపట్టాము” అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలకు విస్తృత మద్దతు లభిస్తుందని వైద్యుల సంఘం నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో ఈ ఉద్యమం విజయవంతం కావాలని కోరారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 5 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..