

గద్వాల జిల్లా మనధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోనీబావి రాముడు భార్య సంధ్య ఇద్దరు దంపతులు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్ కు చేపల వేట కోసం వెళ్లారు. అయితే రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా ఎస్పీ శ్రీనివాస రావుతో కలిసి రిజర్వాయర్ దగ్గరికి వెళ్లి పరిశీలించడం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే , ఎస్పీ రిజర్వాయర్ లోకి బోటులో గాలించిన చేయడం జరిగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ….గ్రామంలో తీవ్ర విషాద సంఘటన జరగడం చాలా బాధాకరం అని తెలిపారు. గజఈత గాళ్లతో గాలింపు చేయించి తొందరగా రిజర్వాయర్ లో గల్లంతయిన వారిని గుర్తించాలని అధికారులకు, పోలీస్ అధికారులకు, సూచించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం నుండి అందించే వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు ఆర్థికంగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకలు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అలాగే వారి పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే గారు భరోసాని ఇచ్చారు.అదేవిధంగా ఎమ్మెల్యే ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా బాధితుల పిల్లలకు బాబుకు 5 లక్షలు, పాపకు 5 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా తాటికుంట గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, వై చంద్రశేఖర్ రెడ్డి , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
