తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతుసంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను అడిగి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా మనధ్యాస న్యూస్ సెప్టెంబర్ 3: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండలం పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన దుబ్బోనీబావి రాముడు భార్య సంధ్య ఇద్దరు దంపతులు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్ కు చేపల వేట కోసం వెళ్లారు. అయితే రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జిల్లా ఎస్పీ శ్రీనివాస రావుతో కలిసి రిజర్వాయర్ దగ్గరికి వెళ్లి పరిశీలించడం జరిగింది. స్వయంగా ఎమ్మెల్యే , ఎస్పీ రిజర్వాయర్ లోకి బోటులో గాలించిన చేయడం జరిగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ….గ్రామంలో తీవ్ర విషాద సంఘటన జరగడం చాలా బాధాకరం అని తెలిపారు. గజఈత గాళ్లతో గాలింపు చేయించి తొందరగా రిజర్వాయర్ లో గల్లంతయిన వారిని గుర్తించాలని అధికారులకు, పోలీస్ అధికారులకు, సూచించారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం నుండి అందించే వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు ఆర్థికంగా ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకలు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అలాగే వారి పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే గారు భరోసాని ఇచ్చారు.అదేవిధంగా ఎమ్మెల్యే ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా బాధితుల పిల్లలకు బాబుకు 5 లక్షలు, పాపకు 5 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా తాటికుంట గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, వై చంద్రశేఖర్ రెడ్డి , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..