అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ లు పంపిణీ చేస్తాం. గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్

గూడూరు:- అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ప్రతిపక్షాలు పెన్షన్లు పూర్తిగా తొలగిస్తున్నామని అవాస్తవా ప్రచారాలు చేస్తున్నాయని వాటిని నమ్మవద్దని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కోరారు . గూడూరు పట్టణంలోని 16వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు .అనంతరం పోలేరమ్మ ఆలయం వద్ద పూజలు, నిర్వహించి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తిని ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా గెలిచిన వెంటనే పెన్షన్లను పెంచడం జరిగిందని గుర్తు చేశారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ ,రైతుకు ఆర్థిక సహాయం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ ,బిల్లు చెంచురామయ్య శివకుమార్ ,సుమన్, పావని ,ముని గిరీష్, రవీందర్ రెడ్డి ,ప్రణీత్ యాదవ్, జహంగీర్ , రహీం ,ఇజ్రాయిల్ ,సురేంద్ర అమరయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు .

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..