ఉరవకొండ, మన న్యూస్: పదవుల కేటాయింపులో సమతుల్యత పాటించాలనే డిమాండ్‌తో కూటమి భాగస్వామ్య పార్టీలైన బిజెపి, జనసేన నేతలు గళమెత్తారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల విషయంలో పాలకపార్టీ తమకే పరిమితం కాకుండా, భాగస్వామ్య పార్టీలకూ ప్రాధాన్యత ఇవ్వాలని వారు స్పష్టంచేశారు. నాయకులు తెలిపారు , మార్కెట్ యార్డు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, పెన్నహోబిలం దేవస్థాన పాలక మండలి చైర్మన్, సింగిల్ విండో అధ్యక్ష స్థానాలు వంటి పదవుల విషయంలో భాగస్వామ్య పార్టీల నేతలకు సముచిత అవకాశాలు ఇవ్వకపోతే కూటమి స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని. కూటమిలో భాగస్వామ్యం ఉన్న ప్రతీ పార్టీకి గౌరవం దక్కేలా స్థానాల కేటాయింపు జరగాలని వారు హితవు పలికారు. అలాగే, మహిళా రిజర్వేషన్ల అమలుపై కూడా నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లను వాస్తవానికి మలచే క్రమంలో పెన్నహోబిలం దేవస్థాన పాలక మండలి చైర్మన్ పదవిని బిజెపి మహిళా మోర్చా నాయకురాలు దగ్గుపాటి సౌభాగ్యకు అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఇది కేవలం రిజర్వేషన్‌ అమలుకే కాకుండా, మహిళా నాయకత్వానికి ప్రోత్సాహం కలిగించే చర్య అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.

బిజెపి, జనసేన నాయకులు స్పష్టంచేసిన విషయమేమిటంటే—కూటమి కొనసాగింపు కోసం పరస్పర గౌరవం, సమన్వయం చాలా కీలకం. అందులో భాగంగా నామినేటెడ్ పదవుల కేటాయింపులోనూ సమాన భాగస్వామ్యం కల్పిస్తేనే కూటమి బలపడుతుందని వారు పేర్కొన్నారు. పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందనే భావన కలగకుండా, అన్ని వర్గాలకూ, ముఖ్యంగా భాగస్వామ్య పార్టీలకు, అవకాశాలు ఇవ్వడం అవసరమని నాయకులు పునరుద్ఘాటించారు. కూటమి స్ఫూర్తిని నిలబెట్టే దిశగా పాలకపార్టీ తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *