మానవత్వం చాటుకున్న ముదునూరి మురళీ కృష్ణంరాజు

మానవత్వం చాటుకున్న ముదునూరి మురళీ కృష్ణంరాజు

(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు : సాయం అంటే ఆమడ దూరం పోయే రోజులివి, ఎదుట వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడడం ఖచ్చితంగా గొప్ప విషయమే.నిరుపేదల కష్టాన్ని తన కష్టంగా భావిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నేత ముదునూరి మురళీకృష్ణంరాజు శనివారం రెండు కుటుంబాలకు తన వంతు సాయం అందించి మరో మారు దాతృత్వం చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే ప్రత్తిపాడు మండలం, బవురువాక గ్రామానికి చెందిన చింతల లోవరాజు తల్లి ఇటీవల స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత ముదునూరి శనివారం ఆ గ్రామానికి వెళ్లి చింతల కుటుంబాన్ని పరామర్శించి రెండు బస్తాల బియ్యం 5000 రూపాయలు నగదు సాయం చేశారు.అనంతరం గిరిజనుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అలాగే ఒమ్మంగి గ్రామానికి చెందిన మెహరా దేవత ప్రమాదవశాత్తు గాయపడటంతో ఆమెను ముదునూరి పరామర్శించి రూ.5000 నగదు అందించారు.ఈ సందర్భంగా మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అంటే ఓట్లు పొందడం కాదని,ప్రజల సమస్యలు పరిష్కరించడానికి,ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగాఉండాలన్నారు.ఏ నాయకుడైనా కార్యకర్తపై అనురాగం,అభిమానం చూపిస్తూ మనస్సును గెలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు రామిశెట్టి బుల్లి రామకృష్ణ(నాని),సర్పంచ్ లక్ష్మి,వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీనివాస్,కోదండం నాగేశ్వరరావు,సతీష్ రాజు, కోలా తాతబాబు,యాళ్ల ఏసు,మాగాపు శివ,కొప్పన వెంకన్నబాబు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు