

మన న్యూస్: బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తున్నదని రియల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామారావు తెలిపారు.. శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన జాతీయ బాల్ వివాహా ముక్త్ భారత్ అనే ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ప్రారంభించారని ఇందుకు గాను తమ సంస్థ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేశారు.. బాల్య వివాహన అరికట్టేందుకు గాను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 27వ తేదీన జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు ,జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ కూటమి వ్యవస్థాపకులు భువన్ రిభు ఆధ్వర్యంలో మనదేశంలోని 400 జిల్లాలో 250 మంది ఎన్జీవోస్ ద్వార ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అలాగే చిత్తూరు జిల్లాలో తమ సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీలు ,ప్రతిజ్ఞ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు అలాగే కార్మిక శాఖతో కలిసి బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించడం జరిగిందని వారికి ఉపాధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలియజేశారు. జిల్లాలో ని అన్ని పాఠశాలల్లో గుడ్ టచ్, అండ్ బ్యాడ్ టచ్ కార్యక్రమం పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు.. ఈ వీడియో సమావేశం సమావేశం లో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ చిత్తూరు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హనీషా, మురళీమోహన్, కరుణ శేఖర్ , భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు