జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదు… బిసి, రాజ్యాంగబద్ధంగా అధికారులు లోబర్చుకొని తప్పుడు ధృవీకరణ పత్రం తో ఎమ్మెల్యేగా విజయం సాధించారు, ఈ విషయంపై జనవరి 8న తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను, ఎమ్మెల్యే లక్ష్మీ కాంత్రాలతో రాజీ పడే ప్రసక్తి లేదు,  న్యాయస్థానం లో తనకు న్యాయం జరుగుతుంది,  జుక్కల్ లో ఉప ఎన్నిక కాయం, విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే,

మన న్యూస్ ,నిజాంసాగర్,(జుక్కల్ ) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరవు ఎస్సీ వర్గానికి చెందినవాడు కాదని, ఆయన బిసి వర్గానికి చెందిన వ్యక్తిగా తాను ఆధారంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందని జుకల్ బారసా మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే వెల్లడించారు. ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం లోబడి తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎమ్మెల్యేగా పోటీ చేశారని. ఈ విషయంలో తోట లక్ష్మీకాంతరావు ఎస్సీ కాదు, బీసీ వర్గానికి చెందిన వాడని తాను ఎన్నిక పిటిషన్ వేయడం జరిగిందని. న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని హనుమాన్ షిండే ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో జీవితంలో ఎప్పుడు కూడా రాజీ పడేది ప్రసక్తే లేదని కరాకండిగా తేల్చి చెప్పారు. ఇటీవల తాను, కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత్రావుతో రాజీ పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయాన్ని హనుమాన్ షిండే ఖండించారు. తాను 15 ఏళ్ల కాలం పాటు జూకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశానని ఎక్కడైనా అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు ఉంటే రుజువు చేస్తే తాను రాజకీయం నుంచి తప్పుకుంటారు అని భార స మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిండే వెల్లడించారు. తన జీవితం తెల్ల కాగితం లాంటిదని ఎప్పుడు ఎవరైనా తాను తప్పు చేసినట్లు రుజువు చేస్తే తలవంచుతానని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు. ఎక్కడి నుంచో వచ్చి జూకల్ ఎమ్మెల్యేగా తోట లక్ష్మీ కాంత్రావుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విజయానికి కష్టపడితే. ప్రస్తుతం వారిపై తిరుగుబాటు చేస్తున్నారని హనుమాన్ సిండే ఆరోపించారు . తోట లక్ష్మీకాంత్ రావు ఏడాది పాలనలో జూకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని హనుమాన్ షిండే వెల్లడించారు. విజయానికి కృషి చేసిన వారిపై వారి సంగతి చూస్తానని హెచ్చరిస్తున్నారు అంటూ హనుమాన్ షిండే వెల్లడించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు ఇవ్వడానికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఈ విషయంపై జూకల్ నియోజకవర్గం చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఎమ్మెల్యే లక్ష్మీకాంతవు కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాలని. లక్ష్మీకాంతరావు అవినీతిని అక్రమాలకు కాంగ్రెస్ పెద్దలు దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని హనుమాన్ షిండే గుర్తు చేశారు. మంచి నాయకున్ని ఓడించి, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ గెలిపించినందుకు జూకల్ నియోజకవర్గం ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే పేర్కొన్నారు. ఎప్పటికీ తాను జూకర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని, ఎవరు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలంటూ బారసా నాయకులకు , కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు భరోసా కల్పించారు

  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి