ప్రజల పక్షాన ఉండే పార్టీ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు

మన న్యూస్: అశ్వాపురం బుధవారం రాత్రి అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ సమావేశం కాసబోయిన శ్రీనివాస్,అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, హాజరై మాట్లాడుతూ మల్లెలమడుగు గ్రామంలో, పేదలకి బడుగు బలహీన వర్గాలకు వేలఎకరాలు భూమి పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీదని, ఈ గ్రామాలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రోడ్లు, విద్యుత్తు, స్కూల్స్, అభివృద్ధి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిందని వారు గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని , పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఒకప్పుడు మొండికుంట, మల్లెలమడుగు,గ్రామాలలో కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా ఉండేదని నేడు నాయకుల్లో కూడా స్వార్థం ఎక్కువైందని అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని వారన్నారు. అనంతరం, మల్లెలమడుగు శాఖ సమావేశంలో 20 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది, కార్యకర్తలు అందరూ సిపిఐ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇవ్వడం జరిగింది,, ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేల్పుల మల్లికార్జున్, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులుకమటం సురేష్,నెల్లిపాక సొసైటీ డైరెక్టర్,కోడి వెంకన్న,సిపిఐ పార్టీ మండలసహాయ కార్యదర్శులు,దంతాల జగదీష్,కమటం వీరన్న, బుర్ర యాదయ్య,చిలకమర్రి అయోధ్య,ఆకుల అంజయ్య,దంతాల రామయ్య, కాసమల్ల మల్లయ్య, తోట సాంబశివరావు, కంట శ్రీనివాస్,సహదేవ్,సిపిఐ పార్టీ కార్యకర్తలు,తదిరులు పాల్గొన్నారు…

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు