రైతులు కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలి, వ్యవసాయ శాఖ అధికారి కె. తిరుపతిరావు

మన న్యూస్: పాచిపెంట, నవంబర్ 26 పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి వ్యవసాయ శాఖ సలహాలు తీసుకోవాలని కోరారు. కలుపు మందులలో అనేక రకాలు ఉంటాయని,పంట లేకుండా పిచికారి చేసేవి,పంటపై పిచికారీ చేసేవి,,అన్ని రకాల కలుపులను నివారించేవి, కొన్ని రకాల కలుపును మాత్రమే నివారించేవి, భూమిపై పిచికారి చేసేవి, పంటపై పిచికారి చేసేవి, ఇలా అనేక రకాలుగా ఉంటాయన్నారు.కాబట్టి తప్పనిసరిగా వ్యవసాయ సలహాలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు అన్నారు. మంగళవారం నాడు మండలం కర్రి వలస పంచాయతీ కంకణాపల్లి గిరిజన గ్రామం లో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మాట్లాడుతూ వీలైనంతవరకు కలుపు మందులకు దూరంగా ఉండాలని గిరిజన గ్రామాలలో కూలీల కొరత ఉండదు కాబట్టి గొప్పులు తవ్వు కోవాలని కలుపు మందు ఎక్కువగా వాడడం వలన పర్యావరణం దెబ్బతింటుందని అన్నారు.అంతే కాకుండా రసాయన ఎరువులను పూర్తిగా విడిచి పెట్టాలని పశువులు ఎక్కువగా ఉన్నందున మూత్రం సేకరించి పొలాల్లో వేసుకోవడం ద్వారా భూమిని సారవంతం చేయొచ్చని తెలిపారు. అపరాలు మరియు చిరుధాన్యాల సాగును పెంచాలని వీలైనంతవరకు రసాయన ఎరువులను విడనాడాలని తెలిపారు. అనంతరం రైతులకు అపరాలకు విత్తనాలను పంపిణీ చేశారు. కర్రివలసలో కూరగాయల మోడల్ నిరంతర ఆదాయాన్నిచ్చే కూరగాయల మోడల్ ను కర్రి వలస ఐ సి ఆర్ పి సుమలత ఆధ్వర్యంలో వేయించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ తక్కువ విస్తీర్ణంలో కూరగాయల మోడల్ ఏటీఎం మోడల్ అని ఈ మోడల్ ద్వారా తీగజాతి దుంప జాతి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ రకాలు తక్కువ విస్తీర్ణంలో నిరంతరం పండించడం ద్వారా ప్రతిరోజు ఆదాయం పొందవచ్చుని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మోహన్ కృష్ణ సిఆర్పి విజయ్ మరియు నరసింహమూర్తి పాల్గొన్నారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///