

గూడూరు, మన న్యూస్:- గూడూరు మండలం గొల్లపల్లి సమీపంలో కనుమ రాయ కొండపై వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.