

గూడూరు, మన న్యూస్: స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆధ్వర్యంలో సంవిధాన్ హత్య దివస్అనే అంశంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. శివ ప్రసాద్ మాట్లాడుతూ ఉత్తమమైన పరిపాలన విధానానికి మన రాజ్యాంగం పెద్దపీట వేసిందని అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం 1975లో విధించిన జాతీయ అత్యవస పరిస్థితి ప్రజల హక్కులను హరించి వేసిందని కొంతమంది మేధావులను సహితము అసంతృప్తికి గురి చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు కే. రవిరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. విజయ మహేష్ మాట్లాడుతూ 1975 జూన్ 25 జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడడానికి గల కారణాలు మరియు దాని వలన కలిగిన పరిణామాలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణరాజు, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి. పీర్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ శర్మ, కిరణ్మయి, డాక్టర్ కోటేశ్వరరావు, డాక్టర్ శైలజ, భీమవరపు లక్ష్మి, కృపా కరుణ వాణి, హిమబిందు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది ,విద్యార్థినీ విద్యార్థులు ,పాల్గొన్నారు.
