

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 16, రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైతు వేదికల్లో రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా గాలిపూర్,అచ్చంపెట్ రైతు వేదికల్లో సీఎం వీడియో కాన్పరెన్సు(వీసీ) ద్వారా రైతులతో ముచ్చటించారు. ప్రతి మంగళవారం రైతు వేదికలలో వీసీ ద్వారా రైతులకు పంటల సాగుపై అవగాహన ఉం టుందన్నారు.దీనిలో రైతులు తమ సమస్యలను సైతం తెలుసుకోవచ్చని అన్నారు.పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏవో నవ్య,అమర ప్రసాద్,ఎంపీడీవోలు అనిత,గంగాధర్,
ఏఈవోలు స్వర్ణలత,మధుసూదన్, నాయకులు లోక్య నాయక్,బాండ్ల ప్రవీణ్,తాటి పల్లి సరస్వతి తదితరులు ఉన్నారు.

