• నిబంధనల పేరుతో కొంతమందికే తల్లికి వందనం…
  • ఇచ్చిన హామీలను మర్చిపోయారా..?
  • వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు..

శంఖవరం ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుతో ఎన్నో ఆంక్షలు పెట్టి కొన్ని వేల మందికి తల్లికి వందనం పథకం వర్తింప చేయకుండా మోసం చేస్తున్నారని వైసీపీ కో ముద్రగడ గిరిబాబు అన్నారు. హామీలు గుప్పించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లుల ఖాతాల్లో 13 వేలు జమ చేశారని మిగిలిన రెండు వేలు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కి జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉండే విధంగా జీవో ని అమలు చేశారని ఎన్నికల్లో 15 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 2వేలు తగ్గించడం దారుణం అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకం పేరుగా ప్రవేశపెట్టిన పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం పేరుగా మార్చి విద్యుత్ వినియోగం, నెలసరి ఆదాయం, ఇంకా ఎన్నో నిబంధనల పేరుతో ఆంక్షలు విధించి నియోజకవర్గంలో తల్లికి వందనం పథకంలో వేలాది మంది విద్యార్థులు అనర్హులు సచివాలయాల్లో పేర్లు విడుదలవడం బాధాకరమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *