

ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ,మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్త కాకాణి పూజితని పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.మన న్యూస్, నెల్లూరు ,జూన్ 8:నెల్లూరు డైకాస్ రోడ్డులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజితని ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ లతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా తలశిల రఘురామ్ పూజిత గారితో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచించారు.కాకాణి ఎలాంటి తప్పు చేయలేదని వారు న్యాయస్థానాల్లో తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకొని ఈ కేసు నుంచి నిర్దోషిగా బయటకు వస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
