నైతిక విలువలు గురించి మాట్లాడే హక్కు ప్రసన్న కుమార్ రెడ్డి కు ఉందా?…… రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య

మన న్యూస్, కోవూరు: *వేమిరెడ్డి దంపతుల తెలిసిన రాజకీయం ప్రజాసేవ మాత్రమే.*నాయకుల పార్టీలు మారడం గురించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడటం హాస్యాస్పదం. రాష్ట్ర టిడిపి కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య మాట్లాడుతూ…… బుధవారం కోవూరు లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవేశం తగ్గించుకోవాలి రాజకీయాల్లో ఆ మాటలు ఎంటి అని మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి ని అడుగుతున్నాం అయ్యా మీరు మీ పాత వీడియోలు ఒకసారి చూడండి మీకు రాజకీయ భిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడు ని ,నారా లోకేష్ ని మీరు ఏ భాష వాడి మాట్లాడారో ఒకసారి పరిశీలించి చెప్పండి ఎవరు భాష నేర్చుకోవాలో తెలపండి అని అన్నారు.2019 నుంచి 2024 వరకు కోవూరు నియోజకవర్గ పరిధిలో తెగుదేశం పార్టీ నాయకులను వైకాపా లో చేర్చుకున్న రోజున మీరు ఎంత ఇచ్చి కొన్నారో ఏ ఏరియాలో కొన్నారో చెప్పి అప్పుడు తప్పు పట్టండి నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న ప్రశాంతి రెడ్డి ని అని అన్నారు.ప్రశాంతి రెడ్డి రాజకీయ ట్యూషన్ పెట్టుకోవాలా ఏ రాజకీయాలు కోసం మీరు చేసిన గ్రావెల్ మాఫియా,మద్యం మాఫియా,ఇసుక మాఫియా,ధాన్యం మాఫియా చేయడానికి కావలసిన రాజకీయాల కోసమా అలాంటి రాజకీయాలు మా శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి అవసరం లేదు వారికి తెలిసిన రాజకీయం ప్రజా సేవ చేయడం మాత్రమే అందుకు వారు కట్టుబడి పనిచేస్తున్నారు అని అన్నారు.వేమిరెడ్డి దంపతుల పార్టీ మారడం గురించి మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి మిమ్మల్ని 4 సార్లు గెలిపించిన తెలుగుదేశం పార్టీ నీ ఓటు వేసిన సిరా ఇంకు గుర్తు మారక ముందే వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన మీరా విమర్శించే నైతిక హక్కు కలిగిన వ్యక్తి అని ప్రశ్నిస్తున్నాం అని అన్నారు.మీ పార్టీ కార్యక్రమాలు మీ అద్యక్షులు మెప్పు కోసం మీరు ఏమైనా చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ మా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి కానీ అసందర్భ ప్రలాపలను చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు.

  • Related Posts

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    పుత్తూరు , మన న్యూస్, జూన్ 8: అఖిల భారత క్షత్రియ మహాసభ – 1897 యువ విభాగం జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ ను ఆంధ్రప్రదేశ్ అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు కోనేటి…

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    మనుబోలు, నెల్లూరు జిల్లా , మన న్యూస్:  తిరుపతి జిల్లాలోని మనుబోలు మండలం లో జరిగిన లోటస్ వ్యాలీ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కుటుంబ సమేతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ