మన న్యూస్, కోవూరు: *వేమిరెడ్డి దంపతుల తెలిసిన రాజకీయం ప్రజాసేవ మాత్రమే.*నాయకుల పార్టీలు మారడం గురించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడటం హాస్యాస్పదం. రాష్ట్ర టిడిపి కార్యదర్శి చెముకుల కృష్ణ చైతన్య మాట్లాడుతూ...... బుధవారం కోవూరు లో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆవేశం తగ్గించుకోవాలి రాజకీయాల్లో ఆ మాటలు ఎంటి అని మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి ని అడుగుతున్నాం అయ్యా మీరు మీ పాత వీడియోలు ఒకసారి చూడండి మీకు రాజకీయ భిక్ష పెట్టిన నారా చంద్రబాబు నాయుడు ని ,నారా లోకేష్ ని మీరు ఏ భాష వాడి మాట్లాడారో ఒకసారి పరిశీలించి చెప్పండి ఎవరు భాష నేర్చుకోవాలో తెలపండి అని అన్నారు.2019 నుంచి 2024 వరకు కోవూరు నియోజకవర్గ పరిధిలో తెగుదేశం పార్టీ నాయకులను వైకాపా లో చేర్చుకున్న రోజున మీరు ఎంత ఇచ్చి కొన్నారో ఏ ఏరియాలో కొన్నారో చెప్పి అప్పుడు తప్పు పట్టండి నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్న ప్రశాంతి రెడ్డి ని అని అన్నారు.ప్రశాంతి రెడ్డి రాజకీయ ట్యూషన్ పెట్టుకోవాలా ఏ రాజకీయాలు కోసం మీరు చేసిన గ్రావెల్ మాఫియా,మద్యం మాఫియా,ఇసుక మాఫియా,ధాన్యం మాఫియా చేయడానికి కావలసిన రాజకీయాల కోసమా అలాంటి రాజకీయాలు మా శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి మా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి అవసరం లేదు వారికి తెలిసిన రాజకీయం ప్రజా సేవ చేయడం మాత్రమే అందుకు వారు కట్టుబడి పనిచేస్తున్నారు అని అన్నారు.వేమిరెడ్డి దంపతుల పార్టీ మారడం గురించి మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డి మిమ్మల్ని 4 సార్లు గెలిపించిన తెలుగుదేశం పార్టీ నీ ఓటు వేసిన సిరా ఇంకు గుర్తు మారక ముందే వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన మీరా విమర్శించే నైతిక హక్కు కలిగిన వ్యక్తి అని ప్రశ్నిస్తున్నాం అని అన్నారు.మీ పార్టీ కార్యక్రమాలు మీ అద్యక్షులు మెప్పు కోసం మీరు ఏమైనా చేసుకోండి కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ మా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి కానీ అసందర్భ ప్రలాపలను చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు.