సర్వేపల్లి ప్రజలకు మా నాన్న (కాకాని గోవర్ధన్ రెడ్డి )పై ఉన్న అభిమానాన్ని ఎవరు ఆపలేరు….. కాకాని పూజిత

మన న్యూస్, వెంకటాచలం :*వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన సర్వేపల్లి ప్రజలు.*జగనన్నపై అభిమానం, గోవర్ధన్ రెడ్డి గారిపై నమ్మకంతో భారీగా తరలివచ్చిన ప్రజల అభిమానులను చూసి భావోద్వేగానికి గురైన కాకాణి పూజిత.*సర్వేపల్లి రోడ్డు నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు ఇసుకవేసిన రాలనంతా జనం.సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలో నిర్వహించిన “వెన్నుపోటు దినం” నిరసన కార్యక్రమంలో ఎంపి మిథున్ రెడ్డి , గురుమూర్తి , భారీగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలసి ర్యాలీగా వెళ్లి, ఎమ్మార్వోకు వినతిపత్రం అందించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత ..కాకాణి పూజిత మాట్లాడుతూ……..రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో *”వెన్నుపోటు దినం”* నిరసన కార్యక్రమం చేపట్టాం అని అన్నారు. ఏడాదిగా ప్రజలకు జరిగిన అన్యాయానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా *”వెన్నుపోటు దినం”* నిరసన కార్యక్రమం నిర్వహించాం అని అన్నారు.కూటమి ప్రభుత్వం ఎన్నికలలో అనేక హామీ ఇచ్చి, సంవత్సరం రోజులైనా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుంది అని అన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తులను టార్గెట్ చేస్తూ, వాళ్ల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది అని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజల కోసం నిలబడే వ్యక్తులను ఇబ్బందులు గురిచేస్తున్నారు అని అన్నారు. భారీగా తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తేనే, కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతుంది అని అన్నారు.సర్వేపల్లిలో *”వెన్నుపోటు దినం”* నిరసన కార్యక్రమం సర్వేపల్లిలో మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి లేకుండా నిర్వహించుకోవడం బాధాకరం అని అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల కోసం రాష్ట్ర శాంతి భద్రతల కోసం పోరాటం చేశారు అని అన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తులను అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపడం ప్రజలకు అన్యాయం చేసినట్లే.. అని అన్నారు.గోవర్ధన్ రెడ్డి గళం నొక్కాలని చూస్తే, నేడు వేలాదిమంది తమ గళం విప్పేందుకు ఇక్కడకు తరలివచ్చారు అని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తే, ప్రజల కోసం గోవర్ధన్ రెడ్డి మాట్లాడేవారు కాదు కదా! అని అన్నారు.ప్రజల కోసం పనిచేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని అన్నారు.ఏడాది కాలంగా ప్రజలకు అందించాల్సిన పథకాలను బకాయిలతో సహా అమలు చెయ్యండి అని అన్నారు.శాంతియుతంగా ప్రజల కోసం ర్యాలీ నిర్వహిస్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుంది అని అన్నారు.ప్రజలకు జరిగిన అన్యాయాన్ని తెలియకుండా చేయాలనే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అని అన్నారు.ఇలాంటి చర్యలను ఆపి, ప్రజలకు మంచి చేయాలని కోరుతున్నాం.. అని అన్నారు.పెద్దలు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ,గురుమూర్తి మా కుటుంబానికి అండగా నిలబడటం ధైర్యాన్ని ఇచ్చినట్లుంది అని అన్నారు.నాన్న జైల్లో ఉన్నా, జగనన్న పై అభిమానంతో, నాన్న పై నమ్మకంతో వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క సర్వేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నాన్న అభిమానులకు, ప్రజలకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేశారు.యం.పి.మిథున్ రెడ్డి మాట్లాడుతూ………కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరకాలం అవుతున్న ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను, సూపర్ సిక్స్ ను నెరవేర్చలేదు అని అన్నారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించాలని *”వెన్నుపోటు దినం”* నిరసన కార్యక్రమం చేపట్టాం అని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై తప్పుడు కేసులు పెట్టి, జైళ్లకు పంపుతున్నారు అని అన్నారు.పరిపాలనను గాలికి వదిలేసి వేధింపులు అక్రమ కేసులు పెడుతూ, కూటమి ప్రభుత్వం బిజీబిజీగా ఉంది అని అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపినా, గోవర్ధన్ రెడ్డి కుమార్తె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు అండగా నిలబడటం అభినందనీయం అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి , గోవర్ధన్ రెడ్డి కి, వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు నెల్లూరు రానున్నారు.. అని అన్నారు.ప్రజలకు మేలు జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కోరుతున్నా.. అనిఅన్నారు.యం.పిగురుమూర్తిమాట్లాడుతూ……ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం నీకు 15 వేలు, నీకు 18వేలు.. అంటూ ప్రజలను మభ్యపెట్టింది అని అన్నారు. కూటమి రోజున ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అని అన్నారు.ప్రజల కోసం గళం వినిపించే, కాకాణి గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి, ఆయన గళం నొక్కాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేసింది అని అన్నారు.న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది.. అని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా నిలబడుతుంది అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేయని ప్రతి పథకాన్ని ప్రజలకు అందించాలి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి.. అని అన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ప్రజలకు పథకాలను అందించారు అని అన్నారు. వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, కూటమి ప్రభుత్వంపై తమ నిరసన గళం వినిపిస్తున్నారు అని అన్నారు.

  • Related Posts

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    సీతారామపురం :(మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి నాగరాజు ://// కంటి సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా చూపుకోల్పోయి వైద్య చికిత్సలు చేయించుకుంటున్న సీతారామపురం లోని సినిమా హాల్ వీధి కి చెందిన ఎడమకంటి సుబ్రహ్మణ్యం అనే నిరుపేదకు వైద్య ఖర్చుల నిమిత్తం…

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    కొండాపురం : (మన ద్యాస న్యూస్ ):ప్రతినిధి,నాగరాజు :///// వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//