

మన న్యూస్, నెల్లూరు: నెల్లూరు ,జల వనరుల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా జె.శరత్ కుమార్ రెడ్డి , జల వనరులశాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా కె.ఎన్ .రమేష్ లు మే 31వ తేదీన పదవి విరమణ చేస్తున్న సందర్భంగా నెల్లూరు దర్గామిట్ట ఎన్జీవో హోమ్ లో శనివారం రాత్రి పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి.జలవనరుల శాఖలో మచ్చలేని వ్యక్తులుగా, మంచి మనుషులుగా ,మంచి ఉద్యోగులుగా పేరు తెచ్చుకున్నారని పలురు వ్యక్తులు జె శరత్ కుమార్ రెడ్డి ,కె.ఎన్ రమేష్ ల గురించి ప్రశంసిచ్చారు.తర్వాత నేడు పదవి విరమణ చేయుచున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ గా జె. శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ….. నేను శ్రీశైలం రైట్ కెనాల్ లో మొదటి ఉద్యోగం లో చేరాను .తర్వాత తిరుపతికి బదిలీ అయ్యాను. 2007లో డిఇ గా ప్రమోషన్ వచ్చింది. హైదరాబాద్ లో కూడా పని చేశాను . తర్వాత నెల్లూరుకు వచ్చాను, తర్వాత రాళ్లపాడులో బదిలీ అయ్యాను . కెరీర్ మొత్తం చాలా సాఫీగా జరిగిపోయింది .ఎలాంటి సమస్యలు లేకుండా మనస్పూర్తిగా పని చేశాను. 38సంవత్సరాల నా ఉద్యోగ జీవితంలో సాటి ఉద్యోగస్తులు నాకు బాగా సహకరించారు . నా శేష జీవితం తిరుపతిలో సెటిల్ అవుతాను. అక్కడ నిర్మాణ రంగంలో పని చేయాలని ఉంది అని తెలిపారు. పదవి విరమణ చేయుచున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.ఎన్ రమేష్ మాట్లాడుతూ ……నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఇరిగేషన్ శాఖలో 33 సంవత్సరాలుగా పనిచేసి నేడు పదవి విరమణ చేస్తున్నాను అని తెలిపారు .1992 సంవత్సరంలో నెల్లూరు ఇరిగేషన్ సర్కిల్ లో డ్రాప్స్ మాన్ గా ఉద్యోగం ప్రారంభించిన నాను అని అన్నారు.తర్వాత నంద్యాలకు బదిలీ అయ్యాను, అక్కడ పని చేసిన తర్వాత ఏఈగా ప్రమోషన్ మీద కడపకు వెళ్లాను అని అన్నారు.అక్కడ జిఎన్ఎస్ఎస్ సబ్ డివిజన్లో జి ఎన్ ఎస్ ఎస్ మెయిన్ కెనాల్, జిఎన్ఎస్ఎస్ డ్యామ్ రెండు కాలువ పనులకు పని చేశాను అని అన్నారు. తర్వాత ప్రమోషన్ మీద నెల్లూరుకు వచ్చాను. తర్వాత పొదలకూరు మైనర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ లో 2009,2014 పని చేశాను . తర్వాత కందుకూరుకు బదిలీ అయ్యాను, అక్కడ ఇరిగేషన్ సబ్ డివిజన్లో 9 మండలాలకు పనిచేశాను అది చాలా పెద్ద సబ్ డివిజన్. తర్వాత 2022 నెల్లూరుకు వచ్చాను. ఇరిగేషన్ ఆఫీస్ లో టెక్నికల్ డిఇ గా నేడు పదవి విరమణ చేస్తున్నాను అని అన్నారు .ఈ వేడుకలకు బాలమిత్రులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ,తోటి ఉద్యోగస్తులు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు .యాక్చువల్ గా నేను బిజినెస్ చేయాలనుకున్నాను కానీ ఉద్యోగం వచ్చింది అందుకని రిటైర్ అయిన తర్వాత కాపారం చేయాలనుంది ,దేవుడు ఎలా నిర్ణయిస్తారో చూడాలి అని అన్నారు.అనంతరం తోటి ఉద్యోగస్తులు, బంధుమిత్రులు జె.శరత్ కుమార్ రెడ్డి, కె యన్ .రమేష్ లను శాలువ కప్పి సత్కరించారు. ఈ వేడుకులకు వచ్చిన బంధుమిత్రులకు, తోటి ఉద్యోగస్తులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జె. శరత్ కుమార్ రెడ్డి ,కె.ఎన్ రమేష్ లు తెలియజేశారు.










