

మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు.అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి బోనాలను అందంగా అలంకరించుకొని సాయంత్రం బాజా భజంత్రీలతో గ్రామ దేవత వద్దకు తీసుకువెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి మొక్కును చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా
నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ బోనాన్ని ఎత్తి గుడి వరకు తీసుకువెళ్లి గ్రామదేవతకు మొక్కుకున్నానుఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి గ్రామ అధ్యక్షులు బండారి చిరంజీవి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.