రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సహకరించాలి…

కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిని కలసి విన్నవించిన శాప్ చైర్మన్ రవి నాయుడు

Mana News :- తిరుపతి నవంబర్ 21,(మన న్యూస్ ) :- ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర క్రీడల సహాయ శాఖ మంత్రి రక్షా నిఖిల్ కట్సే ను కలిసి రవి నాయుడు విన్నవించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రిని గురువారం తిరుపతిలో షాప్ చైర్మన్ రవి నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కావలసిన సదుపాయాలు, వసతులు, నిధుల విడుదల గురించి సుదీర్ఘంగా కేంద్ర సహాయ మంత్రికి శాప్ చైర్మన్ రవి నాయుడు వివరించారు. అనంతరం రవి నాయుడు మీడియాతో మాట్లాడుతూ కాకినాడ అమరావతి ప్రాంతాలలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయాలని అలాగే తిరుపతిలో స్టేట్ లెవల్ ఖేలో ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సెంటర్ ను నిర్మించాలని అందుకు కేంద్ర నిధులు మంజూరు చేయాలని కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రిని కోరామని మని రవి నాయుడు తెలిపారు. రాష్ట్రంలో క్రీడల మౌలిక సదుపాయాలు ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపమని వాటిని అమలు జరిగేలా చూడాలని కోరారు. క్రీడాకారులు జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు రైళ్లలో వెళ్లేందుకు అందుకు కన్స్ట్రక్షన్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్ర క్రీడల సహాయ మంత్రి సానుకూలంగా స్పందించారని, ఆంధ్రప్రదేశ్లో క్రీడాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని రవి నాయుడు తెలిపారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..