దళితుల యువకులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

బద్వేల్: మన న్యూస్: మే 29: శాంతి భద్రతులను కాపాడవలసిన పోలీసులే దళితులపై దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ తెనాలి పట్టణంలో దళితులు రౌడీసీటర్లు అనే నెపముతో వారిని పిలిపించి నడిరోడ్డు పైన పడుకో బెట్టి లాఠీలతో కొట్టడం అనేది సభ్య సమాజంలో సిగ్గుచేటుగా ఉందని, వారన్నారు. దళితులు ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా శిక్షించవలసిన పోలీసులే నడిరోడ్డు పైన వారిని మానసిక శోభకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారిని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిందని దళిత యువకులను తీసుకొని విచక్షణారహితంగా కొట్టడం అనేది మానవ హక్కుల ఉల్లంఘనే అని వారు పేర్కొన్నారు. గతంలో అగ్రకులస్తులు దళితులపై అక్కడక్కడ దాడి చేయడం చూస్తున్నాము, పోలీసులే దళిత యువకులపై కఠినంగా దాడి చేయడం అనేది హేయమైన చర్య. ఈ విషయమై జాతీయ ఎస్సీ కమిషన్ డీజీపీకి నోటీసులు ఇచ్చిన దళిత యువకులకు న్యాయం జరగడంలో ఆలస్యం జరిగే విధంగా ఉందని, వారు పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు స్వర్ణాంధ్ర యుగంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్లో దళితులపై ఇటువంటి దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య, దళిత సీనియర్ నాయకులు బత్తలకూరి కేశవయ్య, డీఎస్పీఎస్ నాయకులు పి వెంకటరమణ. టి బి ఎఫ్ సీనియర్ నాయకులు చిన్నయ్య.

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    గొల్లప్రోలు జూన్ 8 మన న్యూస్ : ఏ పి ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఏర్పాటు జరిగినట్లు సొసైటీ జనరల్ సెక్రటరీ, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కనిగిరి వెంకట రంగారావు ఒక ప్రకటన లొ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

    యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి