తిరుమ‌ల త‌ర‌హాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

  • పంచ‌మితీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు
  • టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు

Mana News :- తిరుపతి, నవంబర్ 21,(మన న్యూస్ ) తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలను నవంబరు 28 నుంచి డిసెంబ‌ర్ 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు అధికారులను ఆదేశించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గురువారం సాయంత్రం ఆయ‌న బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుచానూరు బ్ర‌హ్మోత్స‌వాల్లో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన పంచ‌మి తీర్థం రోజు భ‌క్తుల‌కు చ‌క్క‌టి ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. హోల్డింగ్ పాయింట్ల‌లో ఉండే వేచి ఉండే భక్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా మంచినీరు, అల్పాహారంతో పాటు మ‌రుగుదొడ్ల‌ను కూడా అందుబాటులో ఉంచేందుకు ముంద‌స్తుగానే ప్ర‌ణాళిక చేసుకోవాల‌న్నారు. హోల్డింగ్ పాయింట్ల వ‌ద్ద అవ‌స‌ర‌మైన సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు.
ఆరోగ్యశాఖ అధికారులు పారిశుద్ధ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని స్థానిక పంచాయ‌తీ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. వైద్య విభాగం అధికారులు ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాల‌ను, అంబులెన్సుల‌ను ఏర్పాటు చేసి అవ‌స‌ర‌మైన సిబ్బందిని అందుబాటులో ఉంచాల‌న్నారు. సెక్యూరిటీ విభాగం అధికారులు సీసీ కెమెరాల‌ను, అవ‌స‌ర‌మైనంత సిబ్బందిని ఏర్పాటు చేసుకుని స్థానిక పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆదేశాంచారు.
భ‌క్త‌లంద‌రికీ అన్న‌ప్ర‌సాదం విరివిగా అందేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అన్నారు. హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా నిర్వ‌హించే స్టేజ్ కార్య‌క్ర‌మాలు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నాణ్య‌మైన‌విగా ఉండాల‌ని సూచించారు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో వైట్ వాష్‌, క‌ల‌ర్ పెయింటింగ్‌, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ముఖ్య‌మైన ప్రాంతాల్లో ఆర్చిలు ఏర్పాటు చేసి హారితి పాయింట్స్ కోసం లైన్ లు, బారికేడ్లు, చైన్ లింక్ ల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు. ఉద్యాన‌వ‌న విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుచానూరులో ఫ‌ల‌, పుష్ఫ ప్ర‌ద‌ర్శ‌న‌ను భ‌క్తులు ఆక‌ట్టుకునేలా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు.
ఈ స‌మావేశంలో జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ‌ధ‌ర్‌, ఎఫ్ఏసీఏఓ బాలాజీ, సిఈ స‌త్య‌నారాయ‌ణ‌, డిప్యూటీ ఈవో ఈవో గోవింద రాజన్, ఇతర త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..