

- ” ఓ అమ్మ ఆక్రందన” కథనం పై కలెక్టర్ అభినందన..
- డీసీపీయు జాగరపు విజయ బృందానికి సత్కారం…
- ఐటీఐ విద్యార్థి పరమేశ్వర్ కు కలెక్టర్ భరోసా..
కాకినాడ మన న్యూస్ (అపురూప్) కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలితో, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు స్పందించకపోయినా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు మానవత్వాన్ని చాటుకోవడంతో ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.విజయ తన బృందంతో అక్కడకు చేరుకుని అధికారుల సహాయంతో రక్షణ కల్పించిన విషయం ” ఓ అమ్మ ఆక్రందన…”అనే కథనం ద్వారా తెలిసిందే… వివరాల్లోకి వెళితే…కాకినాడ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ (ఐసిడిఎస్) పరిధిలో బాలల సంరక్షణ కోసం పనిచేస్తున్న బృందాన్ని జిల్లా కలెక్టర్ షన్మోహన్ గురువారం కలెక్టరేట్లో ఆయన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొటెక్షన్ అధికారిని జాగరపు విజయ తో పాటు కౌన్సిలర్ బి.దుర్గారాణి, సోషల్ వర్కర్ ఎస్. చినబాబు, ఔడబ్ల్యూ ఆర్. దుర్గ భవాని, ఐటిఐ విద్యార్థి పరమేశ్వర్ ల ను ఘనంగా సత్కరించారు. మంచిపని చేశారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా డిసిపియు బృందంతో కలెక్టర్ సన్ మోహన్ సగిలి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో విధినిర్వాహణలో ఇంతే నిబద్ధత కొనసాగిస్తూ జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ పిడి కుమారి కె.విజయ కుమారి, డిసిపిఓ సిహెచ్. వెంకట్రావు ల సహకారంతో ఉద్యోగ కార్యకలాపాలతో పురోగతి సాధిస్తున్నామని డీపీసీయు బృందం అన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థి పరమేశ్వర్ తో మాట్లాడుతూ, చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగం పొందేందుకు తమ సహకారం అందిస్తామని తెలిపారు. డీపీసీయు అధికారిని జాగారపు విజయ మాట్లాడుతూ, ఈ నెల 20న కాకినాడ బస్టాండ్ సమీపంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ తల్లి తన నాలుగేళ్ల, రెండేళ్ల, నాలుగు నెలల వయసున్న ఇద్దరు బాలలు, ఒక బాలికతో హోరు వానలో రోదిస్తుండగా వారిని గమనించిన కాకినాడ ప్రభుత్వ ఐటిఐ కళాశాల లో చదువుతున్న పరమేశ్వర్ అనే విద్యార్థి డిసిపియు బృందానికి చారవాణి ద్వారా సమాచారం అందించగా, విద్యార్థి సమాచారం మేరకు తక్షణమే డీసీపీయు ప్రొటెక్షన్ అధికారిని జాగరపు విజయ ఆమె బృందం తక్షణమే స్పందించి తల్లి బిడ్డలను చేరుకొని వారి నుండి విచారణ చేపట్టి కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడినుండి బాలల సంక్షేమ సమితి ఆదేశాల మేరకు సఖి వన్ స్టాప్ సెంటర్ కు తరలించి సంరక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం తల్లి బిడ్డల సంరక్షణ బాధ్యతలను బాలల సంక్షేమ సమితి పర్యవేక్షిస్తుందన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ తల్లి బిడ్డల హృదయ విదారక స్థితి తెలుసుకొని చలించిపోయారని, వారిని రక్షించి ఆసుపత్రి మరియు హోమ్ కి కు తరలించిన డీపీసీయు బృందాన్ని కలెక్టర్ కార్యాలయంలో అభినందించడం జరిగిందని అన్నారు. నిర్వహిస్తున్న బాధ్యతకు మరింత ప్రోత్సాహం అందించిన కాకినాడ జిల్లా కలెక్టర్ సన్మోహన్ సగిలికి ఆమె ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.