చేరిన పూడిక…. శిథిలావస్థలో డి 28 ఉపకల్వ పట్టింపు లేని ఇరిగేషన్ శాఖ రూ, 250 కోట్లతో ఏ కాల్వలు బాగు చేశారు అధికారులు లారా? పత్రిక ముఖంగా చేసిన అభివృద్ధిని వెల్లడించండి రైతుల డిమాండ్..

మన న్యూస్, 250 కోట్ల రూపాయలతో నిజాంసాగర్ ప్రధాన కాలువ, ఉపకాల్వల బాగుకు వెచ్చించమంటూ సాగునీటి పారుదల శాఖ అధికారులు గొప్పగా చెప్పుకుంటున్న అధికారులు క్షేత్రస్థాయిలో నిజం సాగర్ కాల్వల దుస్థితి ఒక్కసారి చూస్తే మీరు చేసిన అభివృద్ధి ఏందో తెలిసిపోతుంది.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును మంజీరా నదిపై నిజం సాగర్ వద్ద 1930లో నవా ప్రభుత్వం నిర్మించింది. అప్పటినుంచి 2008 వరకు ఈ నిజాంసాగర్ కాలువలపై ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన ఎవరు పట్టించుకోకపోవడంతో, 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిజాంసాగర్ ప్రధాన కాలువ, ఉపకాల్వలకు పూర్వ వైభవం తీసుకురావడానికి 542 కోట్లు మంజూరు చేశారు. దీనితో నిజం సాగర్ ప్రధాన కాలువ, ఒకటి నుంచి 82 వరకు గల ఉపకాల్వలు బాగు చేశారు. ఆ తర్వాత 2017లో కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ కింద నిజాంసాగర్ ప్రధాన కాలువ, ఉపకాల్వాలు బాగు కోసం 262 కోట్ల రూపాయలు కేటాయించింది. వీటితో నిజం సాగర్, బాన్సువాడ, బోధన్ ప్రాంతంలో ప్రధాన కాల్వతో పాటు, ఉపకాల్వలు 2022 వరకు బాగు చేశామని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ 250 కోట్ల రూపాయలతో పనులు ఎక్కడ కూడా సక్రమంగా చేయకుండా భారీ ఎత్తున నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక బాన్స్వాడ నియోజకవర్గంలోని 87 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు నీటిపారుదల శాఖ అధికారుల రికార్డులు చూపుతున్నాయి. క్షేత్రస్థాయిలో నిజాంసాగర్ ప్రధాన కాలువ మొదలుకొని, ఒకటి నుంచి 28 ఉపకాల్వల వరకు పూడికచేరి, తూములు, కాల్వ గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మన దినపత్రిక రాష్ట్ర ప్రతినిధి డి 28 ఉపకాల్వ దుస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. ఈ ప్రధాన కాల్వ కింద కోటగిరి,, రుద్రూర్, బోధన్, సాలూర ప్రాంతాలకు సుమారుగా 50వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ కాలువ దుస్థితి అద్వానంగా మారింది. పూర్తిగా కాల్వలో పూడిక చేరిపోయింది, దీంతోపాటు తూములు శిథిలావస్థకు చేరుకున్నాయి, కాల్వ గోడలు పగుళ్ల బారిన పడ్డాయి. 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే డి 28 ఉపకల్వ దుస్థితి ఇలా ఉంటే, మరి ఉపకల్వల దుస్థితి ఏ విధంగా ఉందో ఆలోచించే అవసరం లేదు. ఉప కాల్వలని పూడికచేరి, శిథిలావస్థకు చేరుకొని చివరాయకట్టుకు నీరు అందించడం గగనమైంది. నాబార్డు నుంచి మంజూరైన 250 కోట్ల రూపాయలతో 2022 వరకు పనులు పూర్తి చేశాము అని చెప్పుకొని వస్తున్న సాగునీటి పార్లర్ శాఖ అధికారులు పనులు ఎక్కడ చేశారో, పత్రిక ముఖంగా వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు