

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా మానవపాడు మండలం హై స్కూల్ నందు ఈరోజు ఉదయం 10 గంటలకు ఉచిత వైద్య శిబిరం కామాక్షి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.శాంతినగర్ సిఐ టాటా బాబు, భాస్కర్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.కామాక్షి హాస్పిటల్ వైద్యుల బృందం డాక్టర్ చైతన్యవాణి ఆంకాలజిస్ట్, డాక్టర్ సమత గైనకాలజిస్ట్, డాక్టర్ శశిధర్ రెడ్డి పిల్లల స్పెషలిస్ట్, డాక్టర్ సుభాన్ ఆర్తో స్పెషలిస్ట్,, డాక్టర్ కేదార్ ఎండి, జనరల్ ఫిజీషియన్ వారు హాజరై రోగులను పరీక్షించడం జరిగింది.ఉచిత వైద్య శిబిరాన్ని ఉద్దేశిస్తూ, వారు మాట్లాడుతూ సీఐ టాటా బాబు, జోగులాంబ గద్వాల జిల్లా ఆర్ఎంపి పి.ఎం.పి జిల్లా అధ్యక్షుడు పి హుస్సేన్…
గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాల వల్ల బీద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. కర్నూలుకు వెళ్లి చూయించుకోలేక బీద రోగులు ఎందరో ఉన్నారు. షుగర్ టెస్ట్ లు ఈసీజీ మరియు వివిధ రకాల జబ్బులకు సంబంధించిన మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. కామాక్షి హాస్పిటల్ మధుసూదన్ రెడ్డి యొక్క టీం ని అభినందించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాంతినగర్ సిఐ టాటా బాబు,, జోగులాంబ గద్వాల జిల్లా ఆర్ఎంపీ పి.ఎం.పి అధ్యక్షుడు పి. హుస్సేన్, గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి, టీవీ9 నరసింహ,శ్రీకాంత్ రెడ్డి, చోటే, సుబ్బారెడ్డి, పరమేష్ నాయుడు, మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వివిధ గ్రామాల ప్రజలు రోగులు పాల్గొనడం జరిగింది.