మన న్యూస్: శేరిలింగంపల్లి మియాపూర్ డివిజన్ పరిధిలోని కోకానట్ గ్రో అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయ‌న కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై ఉప్పలపాటి శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ. మియాపూర్ డివిజన్ పరిధిలోని కోకానట్ గ్రో అసోసియేషన్ సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పీఏసీ ఛైర్మెన్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలను దశలవారిగా పరిష్కరిస్తామని, కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన యూజీడీ పనులను, సీసీరోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేస్తామని, మంజీర మంచినీటి వసతిని మెరుగుపరుస్తామని తెలిపారు.మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషిచేస్తానని చెప్పారు.ఈ కార్యక్రమంలో కోకానట్ గ్రో అసోసియేషన్ సభ్యులు రాంకిషోర్, శ్రీనివాస్ రెడ్డి గంగరాజు యాదవ్, రాజశేఖర్ రెడ్డి, రవి, వివేకానంద రెడ్డి, ప్రసన్న, రాజేష్, సంతోష్, రవికిరణ్, రమేష్ రెడ్డి, రావెళ్ల, ఫణి బోహ, ఫణి రామ్, కరీం, శరత్, రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *