శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

మనన్యూస్,తిరుమల:తిరుమలలో అఖిలాండడం వద్ద ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆలయం ఎదుట ఉన్న అఖిలాండడం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం ఆయురా రోగ్యాలతో ఉండాలని కోరుతూ 750 కొబ్బరికాయలు కొట్టడంతో పాటు ఏడున్నర కిలోల కర్పూరాన్ని స్వామివారికి సమర్పించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం అలుపెరగని పోరాట యోధుడు ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. మార్గం మనందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం మనమందరం పాలు పంచుకుందామని తెలియజేశారు. ప్రజాదరణ ఉన్న నాయకుడు చంద్రబాబునాయుడు అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల జీవితాలలో చిరస్థాయిగా నిలిచిపోయే వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఒక గొప్ప నాయకుడు ఆదర్శంగా తీసుకుని పార్టీలో పని చేయడంఅదృష్టంగాభావిస్తున్నాను. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రూపేంద్ర వర్మ, రాజు యాదవ్, సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..