నెల్లూరులో దివంగత ఆనం వివేకానందరెడ్డి ‘కాంస్య విగ్రహ’ ఏర్పాటుకు స్థలం కేటాయించాలి……..కమిషనర్ కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజ్ఞప్తి

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 9 :నెల్లూరు నగరంలో దివంగత ఆనం వివేకానంద రెడ్డి కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర కార్పొరేషన్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఓ లేఖ రాశారు. మాజీ శాసనసభ్యులు దివంగత ఆనం వివేకానందరెడ్డి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం నెల్లూరు ప్రజలకు సేవలు అందించారన్నారు. నెల్లూరు మునిసిపల్ వైస్-చైర్మన్ గా, చైర్మన్ గా, కో-ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా, నెల్లూరు శాసనసభ్యులుగా రెండు సార్లు మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులుగా ఒకసారి పనిచేశారన్నారు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో వారు ప్రజలకు ఏనలేని సేవలు అందించారని వారి కాంస్య విగ్రహం నెల్లూరులో ఏర్పాటు చేయటం అందరి భాద్యతగా భావిస్తున్నామన్నారు.ఇందుకు సంబంధించి, కార్పొరేషన్ తరపున స్థలం కేటాయిస్తే నా స్వంత ఖర్చులతో వారి కాంస్య విగ్రహం ఏర్పాటుకి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆనం వివేకానందరెడ్డి కుటుంబసభ్యులను, ఆనం వివేకానందరెడ్డి అభిమానులు, వారితో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో ప్రయాణించిన వారిని కలుపుకొని ఈకార్యక్రమం చేపట్టాలని తన ఆకాంక్ష అన్నారు.పొదలకూరు రోడ్డులో పెద్దాస్పిటల్ (GGH) వెనుక భాగంలో ఇప్పటికే ఐ-ల్యాండ్ నిర్మాణం జరిగి ఉందని దానిని మరింత ఆధునీకరించి, కాంస్య విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయింపు చేసినట్లయితే, బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో అంతిమ నిర్ణయం ఆనం వివేకానందరెడ్డి కుటుంబసభ్యులదేనని, మీరు పూర్తి భాద్యత తీసుకొని, వారి కుటుంబసభ్యులతో చర్చించి, అత్యంత వేగవంతంగా స్థల కేటాయింపు చేస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Related Posts

    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) ; జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పాలనా వికేంద్రీకరణకు గుర్తుగా “మా పంచాయతీ – మా గౌరవం” పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ సదస్సును గురువారం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్…

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామములో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నందు పేరెంట్స్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ముక్కు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు సింగిలిదేవి సత్తిరాజులు హాజరయ్యారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    • By APUROOP
    • April 24, 2025
    • 2 views
    అన్నవరం సర్పంచ్ కుమార్ రాజాకు అరుదైన గౌరవం

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    సరస్వతి శిశు మందిర్ లో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    ఉగ్రవాదుల దాడి హేయం – వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు

    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    • By JALAIAH
    • April 24, 2025
    • 6 views
    జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు

    మాఫియాలకు అడ్డాగా మారుతున్న రహదారులు,ఎన్‌హెచ్‌-16పై బరి తెగించిన ఆయిల్‌ మాఫియా,అవాక్కై ఆరా తీస్తే గుట్టు రట్టయిన వ్యాపారం -ప్రత్తిపాడు నుంచి తుని వరకు దుకాణాలన్నింటినీ తొలగించిన ఖాకీలు