సోలార్ పవర్ వాడుదాం — పర్యావరణాన్ని రక్షిద్దాం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

(కోవూరు,మన న్యూస్,ఏప్రిల్ 7 )- మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. – ధాన్యం అమ్మిన 24 గంటలలో రైతుల ఖాతాలలో ఘనత చంద్రబాబు దే.- కోవూరు నియోజకవర్గంలో 90 కోట్లతో విద్యుత్ శాఖలో ఆధునీకరణ పనులు. – ఆక్వా రైతాంగాన్ని ఆదుకుంటాం. – రెండు నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేయండి. – సబ్ స్టేషన్ శంఖుస్థాపన సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సోలార్ పవర్ వినియోగంలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్టంలోనే రోల్ మాడల్ గా మారుస్తామన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . సోమవారం ఆమె ఇందుకూరు మండలలోని కుడితి పాళెం గ్రామంలో ఆమె 2 కోట్ల 77 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న 33/ 11 kv విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం లోనికి వచ్చాక కోవూరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖలో 90 కోట్లు వెచ్చించి కొత్తగా త్రీ ఫేస్‌ పవర్ లైన్స్, 33 kv లైన్స్, అదనపు ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాట్లు లాంటి ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. కోవూరు నియోజకవర్గానికి రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలియచేసారు. కుడితి పాళెం గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణం వెనుక ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారం దువ్వూరు కళ్యాణ్ రెడ్డి చొరవ వుందన్నారు. నిరంతర త్రీ ఫేస్‌ విద్యుత్ సరఫరాతో కుడితిపాలెం పరిసర ప్రాంతంలో ఇకపై అర్ధాంతరంగా పవర్ ట్రిప్ కావడం, లోవోల్టేజ్ కారణంగా మోటార్లు కాలిపోయి రైతులు నష్టపోయే పరిస్థితులు తలెత్తవున్నారు. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం ఆక్వా రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అధికారంలోనికి వచ్చిన పది నెలల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతల రహిత రోడ్ల ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు. ధాన్యం అమ్మిన 24 గంటలలో రైతుల ఖాతాలలో డబ్బులు వేసి ఆదుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ కు ఆమె ధన్యవాదాలు తెలియచేసారు. సాంప్రదాయ విద్యుత్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా ప్రతి ఇంట్లో సోలార్ పవర్ పవర్ వినియోగించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. “ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్‌ బిజిలి” పధకంలో భాగంగా ఎస్సి, ఎస్టీలకు సోలార్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. సోలార్ విద్యత్తు ప్రోత్సాహకాల్లో భాగంగా బిసిలకు కేంద్ర ప్రభత్వం యిచ్చే 60 వేల సబ్సిడీతో పాటు రాష్టం మరో ఇరవై వేలు ఇస్తుందన్నారు. కేంద్ర, రాష్ట ప్రభత్వాలు యిచ్చే సబ్సిడీలు సద్వినియోగం చేసుకొని ప్రజలు సోలార్ విద్యుత్ వినియోగం వైపు మొగ్గు చూపాలన్నారు. సోలార్ పవర్ వినియోగంపై గ్రామాలలో చదువుకున్న యువత పెద్దలకు అవగాహన కల్పించాలన్నారు. కోవూరు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ అధికారుల పనితీరు పట్ల ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సంతృప్తి వ్యక్తం చేసారు. పదిహేనేళ్లుగా విద్యుత్ సదుపాయం లేని గుమ్మళ్ళదిబ్బలో వందకు పైగా స్తంబాలు వేసి యుద్ధప్రాతిపదికన విద్యుత్ కనెక్షన్స్ యిచ్చిన ట్రాన్స్కో సిబ్బందిని ఆమె అభినందించారు. రెండు నెలల్లో సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను, కాంట్రాక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి ట్రాన్స్కో ఎస్ ఇ విజయన్, డి ఇ రమేష్ చౌదరి, ఇందుకూరుపేట మండల టిడిపి అధ్యక్షులు వీరేంద్ర నాయుడు, టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి, మల్లికార్జున, చెంచుకిషోర్ యాదవ్, స్థానిక నాయకులు అప్పాని శ్రీనివాసులు,పి ఎల్ రావు, ఇంతియాజ్ జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!