

పాచిపెంట నవంబర్14( మన న్యూస్ ):=
పార్వతిపురం మన్యం జిల్లా,పాచిపెంట లో,పాచిపెంట మండల కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ఐసిడిఎస్ అధికారులకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో. ప్రాజెక్ట్ నాయకులు ఎన్ బంగారమ్మ రమాదేవి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ సెంటర్ లను మెయిన్ సెంట్రల్ గా మార్చాలని ప్రభుత్వ జీవో వెంటనే విడుదల చేయాలని గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు మినీ వర్కర్లకు ఇవ్వాలని 42 రోజులు సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేసి మినీలను మెయిన్ వర్కర్లుగా మార్చాలని అంగన్వాడీ వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం చెల్లించాలని పై సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళన కార్యక్రమానికి సెలవు మంజూరు చేయాల్సిందిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉద్యోగులు టీ ప్రభావతి సూరమ్మ సుగుణమ్మ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.