

- ఎస్సీ కార్పొరేషన్ రాయితీ రుణాలను వినియోగించుకోండి..
మనన్యూస్ తాడేపల్లి/ అమరావతి (గునపర్తి అపురూప్)
ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో డైరెక్టర్లు ప్రమాణ స్వీకార జరిగిన అనంతరం డైరెక్టర్ సబ్బవరపు గణేష్ చైర్మన్ మరియు రాష్ట్ర డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ వారి ప్రసాదం,మరియు కండువాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు శ్రీ నిమ్మల రామా నాయుడు,సాంఘిక శాఖా మాట్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి,కార్మిక శాఖా మాట్టులు శ్రీ వాసం శెట్టి సుభాష్,సాంఘిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎమ్.మల్లిఖార్జున నాయక్ ని చైర్మన్ మరియు డైరెక్టర్లు సచివాలయానికి వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిశారు. ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్లు నవంబర్ నియమితులైనప్పటికీ సాంకేతిక కారణాలవల్ల ఉత్తర్వులు ఆలస్యంగా వెళ్లడయ్యాయి. ఈ సందర్భంగా ఉత్తర్వులు ఇచ్చిందుకు గాను సంబధిత శాఖ అధికారులకు,మంత్రులకు కృతజ్ఞత లు తెలియజేయడమైనది.
ఎస్సీ కార్పొరేషన్ రాయితీ రుణాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎస్సీ నిరుద్యోగులు మరియు ఇతర అర్హత కలిగిన యువత మరియు ఎస్సీ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడయ్య అన్నారు. రాష్ట్ర నలు మూలాల్లో ప్రాంతాల వారీగా అనుకూలమైన యూనిట్లు నిర్వహించుకోవాలని ఇంకా కావల్సిన యూనిట్లు కొరకు ప్రాంతాల వారీగా ఎస్సీ లబ్ధి దారులు ,ఎస్సీ నాయకులు దళాలు సూచనలు ఇవ్వాలని డైరెక్టర్
మరిడయ్య కోరారు. కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయ్ కుమార్ డైరెక్టర్లు 15 మంది, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.