

*వైకాపా నేత ముదునూరి మురళీకృష్ణమరాజు..*
*జై భీమ్ యూత్ యువతకు క్రికెట్ సామాగ్రిని అందించిన ముదునూరి..*
మన న్యూస్ శంఖవరం ప్రత్తిపాడు (అపురూప్) క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయని ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. కాకినాడ జిల్లా,ప్రత్తిపాడు నియోజకవర్గం వైకాపా నేత ముదునూరి మురళీకృష్ణం రాజు స్వయగృహం నందు స్థానిక జై భీమ్ యూత్ యువతకి క్రికెట్ కిట్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైకాపా నేత ముదునూరి మురళీకృష్ణం రాజు మాట్లాడుతూ,విద్యార్థినీ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని, పోటీల్లో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు. విద్య అనేది మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి ఎలా మెరుగుపరుస్తుందో అదే విధంగా క్రీడలు కూడా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా మనలో భాగస్వామ్యం అయినప్పుడు పరిపూర్ణత గల మనిషిగా అభివృద్ధి చెందుతారన్నారు. ఈ కార్యక్రమంలో కోలా తాతబాబు,జువ్వల దొరబాబు,పోకనాటి వెంకటేశ్వరరావు,యాళ్ల యేసు, దోమలంక బాబ్జి,తూపాటి బాబ్జి,కోలా సూరిబాబు,నల్ల వెంకటేష్, రాపా రాజేష్, శేఖర్,సామ్యూల్, అంబటి గణేష్,రవి, శ్రీను,అప్పారావు తదితరులు పాల్గొన్నారు