

శంఖవరం /కిర్లంపూడి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలు వైసీపీ కోఆర్డినేటర్ గిరిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.
గ్రామంలో కొన్ని రోజుల కిందట రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో తమకు న్యాయం చేయాలని గిరిబాబును కోరారు.
పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని అధికార పార్టీ ఒత్తిళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని, శాంతియుతంగా ఉండి సమయనం పాటించాలని కోరారు.