

నాతో ఉంటూ తొట్టి గ్యాంగ్ పగలు ఎల్లో రాత్రి పచ్చ పార్టీలతో తిరిగేవారు ఎవరో నాకు తెలిసిపోయింది
90 ఎం.ఎల్ బ్యాచ్ ఆగడాలు డ్రామాలు నే కల్లారా చూసా ఇకపై అవి సాగవు
మన న్యూస్, ఎస్ ఆర్ పురం:– కత్తితో నరికిన జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అన్న వారే అసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ అన్నారు. కార్వేటి నగరం మండలం కొల్లాగుంట గ్రామంలో చేనేత కార్మికుల 200 యూనిట్లు ఉచితంగా ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ జీడీ రేట్లు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా సొంత అన్న రాజా అసలైన తెలుగుదేశం నాయకుడు 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కి సేవలు అందిస్తున్నాడు. గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మా అన్న రాజా పై కత్తితో నరికారు. అయినా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అన్నాడు .అలాంటి వాళ్ళు అసలైన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. నేను నియోజకవర్గంలో అప్పుడప్పుడు రాలేను పక్షంలో మా అన్న రాజా మండల అధ్యక్షుడు మీ దగ్గరకు వస్తారు మీ సమస్యను పరిష్కరిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు .ఇకపై 90 ఎం.ఎల్ బ్యాచ్ ఆగడాలు డ్రామాలు గల్లారా చూసాను ఇకపై వారి ఆటలు సాగవు తెలుగుదేశం పార్టీకి కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా అని తెలియజేశారు. మా చిన్నాన్న కొడుకు యోనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు .గతంలో మా చిన్నాన్న కుమారుడు యోనా ను కత్తితో పొట్టపై పొడిచారు.తిరుపతిలో రుయా ఆసుపత్రిలో ఆరు నెలల పాటు చికిత్స పొంది మళ్లీ పార్టీ మీద విపరీతమైన అభిమానంతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేశారని వీరు అసలైన తెలుగుదేశం కార్యకర్త లు అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజేంద్రన్, మండల అధ్యక్షుడు చెంగల్రాయ యాదవ్, మాజీ ఎంపీపీ జనార్దన్ రాజు, మురళి రాజు, టిడిపి యువ నాయకుడు పవన్, మైనారిటీ నాయకుడు సంధాని, నాయకులు తదితరులు పాల్గొన్నారు.