

మనన్యూస్,కామారెడ్డి:జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా చైర్మన్ మహిపాల్ ఆధ్వర్యంలో సోమవారం రోజునా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వివిధ మండలాల చైర్మన్ లను జనరల్ సెక్రటరీలను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది అనంతరం ఎన్ హెచ్ ఆర్ సి సమావేశంలో ఎన్ హెచ్ ఆర్ సి విధి విధానాలు తెలుపుతూ ప్రజా సమస్యలపై అధికారుల వద్దకు చేరే విధంగా చూడాలని దొడ్డి దారిలో పనిచేస్తున్న అధికారులను ప్రశ్నించే విదంగా ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులు పనిచేయాలని ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలని ఎన్ హెచ్ ఆర్ సి సభ్యులకు సూచించారు ఎన్ హెచ్ ఆర్ సి ని ప్రజల ముందుకు తీసుకు వెళ్లే విధంగా కృషి చేయాలని కోరారు. గతంలో పనిచేయని మండల చైర్మన్ లను తీసి వేస్తూ వారి స్థానంలో నూతన చైర్మన్ లను నియమిస్తూ వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ వారికి నియక నియామక పత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సందీప్,జనరల్ సెక్రెటరీ విజయభాస్కరరావు,నర్సింలు జాయింట్ సెక్రెటరీ రాజిరెడ్డి,కన్వీనర్ రవీందర్ రెడ్డి,మహిళా కన్వీనర్ తేజశ్రీ,మీడియా కన్వీనర్ నారాయణ,మండల చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు.
