అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గూండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం

Mana News:- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్ నవంబర్, 13, 2024 వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి వెనుక బీ ఆర్ ఎస్ అరాచక శక్తుల కుట్రేనని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గొడిశాల రామనాధం అన్నారు. బుధవారం క్రాస్ రోడ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వారి దిగజారిన రాజకీయాలకు అద్దం పడుతుంది అని రామనాధం అన్నారు. రాజకీయాలలో హుందాగా మాట్లాడాలని.. ఆ హుందా తనం మీలో లోపించిందని .. చిల్లర మాటలు మా విధానం కాదని, చెల్లని రూపాయి మాటలు మాట్లాడి, ప్రజల్లో ఇంకా చులకన కావోద్దని హితవు పలికారు. నాడు ఎన్నికల సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా రేగా కాంతారావు ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వనని ప్రగల్భాలు పలికి.. మీ సీటు నే 35 వేల మెజారిటీ తో చిత్తు చిత్తుగా ఓడిపోయింది మర్చిపోవొద్దు అన్నారు. పది రోజుల్లో మంత్రిని అయ్యి వస్తా అన్నావు.. పత్తా లేకుండా పోయావు.. పదివేల మెజారిటీతో గెలవబోతున్నాము.. కార్యకర్తలు సంబరాలకు సిద్ధం కండి అని అన్నావు, అదీ అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు భద్రాచలం లో ఉప ఎన్నిక కు సిద్దం అవుతున్నారు, అధికారం కోసం అర్రులు చాచటం మీకే చెల్లిందన్నరు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని.. గౌరవప్రద రాజకీయాలు చేయాలని సూచించారు. వికారాబాద్ లో బీ ఆర్ ఎస్ ప్రేరేపించిన, వారి అనుచరుల ముసుగులో ఉన్న గూండాలను తక్షణమే అరెస్టు చేసి, శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశం లో మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుముల లక్ష్మారెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాస రెడ్డి, బండారు సాంబశివరావు, స్వాతంత్ర రెడ్డి, పాయం అప్పారావు, పాడి హేమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • అధికారులపై దాడి చేసింది బీఆర్ఎస్ గూండాలే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం.
  • సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే రేగా చెల్లని రూపాయి మాటలు.
  • ఎమ్మెల్యే పాయం మీద చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్.
  • Related Posts

    పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహించాలని, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్.

    మన ధ్యాస,నారాయణపేట జిల్లా:- పరిధిలోని మఖ్తల్ పట్టణ పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్‌గా ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్ విధులు స్వీకరించిన అనంతరం మంగళవారం ఉదయం మఖ్తల్ పట్టణం 10వ వార్డు అంబేద్కర్ నగర్ ప్రాంతంలో పర్యటించి పారిశుధ్య పనులను ప్రత్యక్షంగా…

    800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు,జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా:- మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐ పి ఎస్ పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుని గా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన పూసల వెంగపనాయుడు.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఎంపికైన బీద రవిచంద్ర కు శుభాకాంక్షలు తెలిపిన ఉదయగిరి నియోజకవర్గం టిడిపి ఏస్సి సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా సబ్సిడీ రుణ పత్రాల పంపిణీ.

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    ఆటో యూనియన్ నూతన కమిటీ ఎంపిక

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    నెల్లూరు జిల్లాలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయండి…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    చదువుతోపాటు క్రీడలలో కూడా రాణించాలి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి