రైతులను మోసం చేయకండి” మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

మనన్యూస్,సర్వేపల్లి:నియోజకవర్గం,వెంకటాచలం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం సమావేశమై మాజీ మంత్రివర్యులు మరియు నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని అన్నారు.
ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ప్రకటనలకే పరిమితం అవుతున్నారు అన్నారు.సోమిరెడ్డి మొక్కుబడిగా నిర్వహించిన గొలగమూడి పర్యటన చూసి, రైతులు ఆవేదన పడుతున్నారు అన్నారు.
సోమిరెడ్డి డ్రామాలు ఆపి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలి అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత సంవత్సరం పుట్టి (850 కేజీలు) ధాన్యం 25వేల రూపాయలకు అమ్ముడుపోతే, నేడు కూటమి ప్రభుత్వంలో ధర 16 వేలకు పడిపోయింది. రైతులకు కనీసం గిట్టుబాటు ధర పుట్టి(850కేజీలు)కి 19,720/- రూపాయలు కల్పించవలసి ఉండగా, దళారులు పుట్టి (850 కేజీలు)16 వేలకు దోచుకుంటున్నారు దళారులు పుట్టి (850కేజీలు) 16 వేలకు దోచుకుంటుంటే, అధికారులు, ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తూ, మిన్నకుండిపోవడం తప్ప, రైతులను ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు అన్నారు.రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇప్పించేందుకు అధికారంలో లేకున్నా, బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి, మద్దతు ధర ఇప్పించేందుకు కృషి చేస్తున్నాం అన్నారు. రైతులకు ధాన్యం అమ్మకాలలో గిట్టుబాటు ధర లభ్యం కాకపోతే, మా దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే, అధికారులతో మాట్లాడి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తాం అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారులను ఎవ్వరినీ విడిచిపెట్టం అన్నారు.
పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే నా దృష్టికి తీసుకు వస్తే, న్యాయస్థానాలను ఆశ్రయించి, ప్రైవేట్ కేసులు వేస్తాం అన్నారు.
అధికారులు అన్యాయంగా, అక్రమంగా ఎవరి పట్ల ప్రవర్తించినా, సంఘటితంగా అందరూ వెళ్లి అధికారులను నిలదీసి, అన్యాయాలను ఎదిరిద్దాం అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో స్థానిక నాయకులు, కార్యకర్తలు సూచనల మేరకు, బాధ్యత కలిగిన వారిని గుర్తించి, పార్టీ కమిటీలలో స్థానం కల్పిస్తాం అన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ, కూటమి ప్రభుత్వంలో అవినీతి విధానాలను అసహ్యించుకుంటున్నారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, పోరాటాలకైన సిద్ధంగా ఉంటాం అని తెలిపారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా