శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం

మనన్యూస్,తిరుప‌తి:అభివృద్ధి పనులను పరిశీలించిన టిటిడి చైర్మన్ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అని విధాల అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ శనివారం స్థానిక ఎంఎల్ఏ శ్రీ ఆరణి శ్రీనివాసులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వేంటేశ్వరస్వామికి సోదరిగా చెబుతారన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నందున, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా మొదటి విడతగా రూ.3.75 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో ఆర్చ్, ఎస్ఎస్ గ్రిల్స్, రాతి ఫ్లోరింగ్, డ్రైనేజ్ తదితర పనుల పురోగతిని చైర్మన్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా రెండో విడత అభివృద్ధి పనులకు రూ.3.90 కోట్లతో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ముఖ మండపం, పోటు, తూర్పు, ఉత్తరం,
పశ్చిమ వైపు ప్రాకారాలు, మరుగుదొడ్లు తదితర పనులకు సంబంధించి రాబోవు టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మే 6 నుండి 13వ తేదీ వరకు గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు టిటిడి అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. అంతకుముందు చైర్మన్ శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జీ. భానుప్రకాష్ రెడ్డి, శ్రీ ఎం. శాంతారాం, సీఈ శ్రీ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి