మరమ్మతులు చేసారు గుంతలు మరిచారు నాసిరకంగా చెందుర్తి రహదారి మరమ్మత్తు పనులు పూర్తిస్థాయిలో పూడ్చని గుంతలు – ప్రయాణికులు ఆగ్రహం

మన న్యూస్: రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నా కాంట్రాక్టర్లు,అధికారుల నిర్వాకం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడంతో నిర్మించిన కొద్ది రోజులకే రోడ్లు శిధిలమ వుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. గొల్లప్రోలు శివారు జాతీయ రహదారి నుండి చెందుర్తి గ్రామానికి వెళ్లే రహదారి ధ్వంసం కావడంతో వారం రోజుల క్రితం మరమత్తు పనులు చేపట్టారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు మరమ్మత్తు పనులు నిర్వహించారు. పనులు నిర్వహించి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే రోడ్డుపై గుంతలు ఏర్పడటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు చోట్ల గుంతలను పూడ్చిపెట్టకుండా తూతూ మంత్రంగా మరమత్తు పనులు ముగించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి . సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారం పనులు నిర్వహించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులలో నాసిరకం తారు, మెటీరియల్ వినియోగించడం తారును తగు మోతాదులో కలపకపోవడంతో రోడ్డు తక్కువ కాలంలోనే శిధిలావస్థకు చేరుకునే అవకాశముందని పలువురు తెలిపారు. అలాగే గతంలో కూడా రెండు పర్యాయాలు లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ రోడ్డుకు మరమత్తు పనులు నిర్వహించగా కొద్ది రోజులలోనే శిధిలమయ్యిందని ఇప్పుడు కూడా నాసిరకంగా పనులు నిర్వహించడంతో మరల శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చెందుర్తి రోడ్డుమరమ్మత్తు పనుల నాణ్యత పై విచారణ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి