మరమ్మతులు చేసారు గుంతలు మరిచారు నాసిరకంగా చెందుర్తి రహదారి మరమ్మత్తు పనులు పూర్తిస్థాయిలో పూడ్చని గుంతలు – ప్రయాణికులు ఆగ్రహం

మన న్యూస్: రహదారుల నిర్మాణం, మరమ్మత్తు పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నా కాంట్రాక్టర్లు,అధికారుల నిర్వాకం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడంతో నిర్మించిన కొద్ది రోజులకే రోడ్లు శిధిలమ వుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. గొల్లప్రోలు శివారు జాతీయ రహదారి నుండి చెందుర్తి గ్రామానికి వెళ్లే రహదారి ధ్వంసం కావడంతో వారం రోజుల క్రితం మరమత్తు పనులు చేపట్టారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు మరమ్మత్తు పనులు నిర్వహించారు. పనులు నిర్వహించి పట్టుమని పది రోజులు కూడా కాకుండానే రోడ్డుపై గుంతలు ఏర్పడటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు చోట్ల గుంతలను పూడ్చిపెట్టకుండా తూతూ మంత్రంగా మరమత్తు పనులు ముగించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి . సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారం పనులు నిర్వహించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులలో నాసిరకం తారు, మెటీరియల్ వినియోగించడం తారును తగు మోతాదులో కలపకపోవడంతో రోడ్డు తక్కువ కాలంలోనే శిధిలావస్థకు చేరుకునే అవకాశముందని పలువురు తెలిపారు. అలాగే గతంలో కూడా రెండు పర్యాయాలు లక్షలాది రూపాయలు వెచ్చించి ఈ రోడ్డుకు మరమత్తు పనులు నిర్వహించగా కొద్ది రోజులలోనే శిధిలమయ్యిందని ఇప్పుడు కూడా నాసిరకంగా పనులు నిర్వహించడంతో మరల శిథిలావస్థకు చేరుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చెందుర్తి రోడ్డుమరమ్మత్తు పనుల నాణ్యత పై విచారణ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

  • Related Posts

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్‌ 18 : భక్తులకు దేవాదాయశాఖపై నమ్మకం భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయశాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఆలయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం ఉదయం…

    నెల్లూరులో వైభవంగా కాప్స్ రాక్స్ కార్తీక మాస వనభోజనాలు

    మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:నెల్లూరులో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా కాప్స్ రాక్స్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న వనభోజనాల కార్యక్రమం ఆదివారం బలిజ భవన్లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ ,వారి సతీమణి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్