భారత్ గౌరవ్ అవార్డు అందుకున్న కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

మన న్యూస్: కాకినాడ, డిసెంబర్ 18: కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కు మరో ఆరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసు ఎంపీగా, కాకినాడ జిల్లా అభివృద్ధిపై తనదైన మార్క్ చూపిస్తున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పాల్గొన్న తొలి ఎంపీగా చరిత్ర సృష్టించగా తాజాగా ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ అవార్డును అందుకున్నారు. పిన్న వయసులోనే వ్యాపారవేత్తగా రాణించి ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సేవల ను గుర్తించిన భారత్ గౌరవ్ అవార్డు ఫౌండేషన్ నిర్వాహకులు భారత్ గౌరవ్ అవార్డును అందజేశారు. బుధవారం న్యూఢిల్లీలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చేతుల మీదుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఈ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో 5 మంది ఎంపీలకు ఈ అవార్డును ప్రధానం చేయగా అందులో కాకినాడ ఎంపీ కి స్థానం దక్కడం గమనార్హం. ఈ సందర్భంగా కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత్ గౌరవ్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు. వ్యాపారవేత్తగా రాణిస్తున్న తనను గుర్తించి రాజకీయంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ గౌరవ్ అవార్డు అందుకున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను కూటమి నాయకులు,కార్యకర్తలు ఘనంగా అభినందించారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం