కర్రివలస ప్రజలకు నేటికీ మోక్షం కలిగింది

మన న్యూస్: పాచిపెంట, పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గత 20 ఏళ్లుగా రహదారి నిర్మాణం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన కర్రివలస ప్రజలకు నేటికి మోక్షం కలిగింది. గ్రామ రహదారికి మహర్దశ కలిగింది.మరమ్మత్తులకు చేరుకొని ఏళ్ల తరబడి ప్రయాణికులు,పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నవిషయం అందరికీ తెలిసిందే. కానీ ఇంతవరకు ఏ ఒక్కరు పట్టించుకోలేదు. 2000 సంవత్సరం నుంచి ఇంతవరకు రహదారి లేక ఇబ్బందులు పడుతూ వచ్చారు. గత ప్రభుత్వం హయాంలోఈ రోడ్డు సిమ్మెంట్ రహదారి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఉపాధి నిధులు మంజూరు చేశారని పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మర్రి ఉమా మహేశ్వర రావు విలేకరులకు తెలియజేశారు. ప్రస్తుతం వర్షాలు దృష్ట్యా ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారని అందుచేత రహదారి నిర్మాణానికి రంగం సిద్ధం చేశామని పనులు వేగవంతంగా చేపట్టి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలుగుతాయని ఆయన విలేకరులకు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఈ పనులు చేపడుతున్నట్టు సర్పంచ్ ప్రతినిది ఉమా తెలిపారు. రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉమామహేశ్వర కు కర్రి వలస గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..