వినాయకుని దీవెనలు అందుకున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబం

మన ధ్యాస ,నెల్లూరు ,ఆగస్టు 28: నగరంలోని పలు విగ్నేశ్వరులను దర్శించుకున్న మంత్రి నారాయణ సతీమణి రమాదేవి మనవళ్లు* విఘ్నాలు పోవాలి..విజయాలు రావాలి, ప్రజలకు హ్యాపీ వినాయక చవితి తెలిపిన మంత్రి* ఘనంగా స్వాగతం పలికిన మండపాల నిర్వాహకులు* విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వెయ్యాలి.ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఉండాలని వారంతా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా మంత్రి నారాయణ అయన సతీమణి రమాదేవి.. మనవళ్లు వేద్ ,ఇషాన్ తో కలిసి నెల్లూరు నగరంలోని పలు విగ్నేశ్వరుల మండపాలను దర్శించుకున్నారు.మంత్రి నారాయణ కుటుంబ సభ్యులకు వినాయక మండపాల నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.విఘ్నేశ్వరుడు దర్శించుకొని అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుని దీవెనలను మంత్రి నారాయణ కుటుంబం తీసుకుంది ముందుగా ములుముడి బస్టాండ్ సెంటర్లో శ్రీ గణేష్ మరాఠీ మిత్ర మండలి ఏర్పాటు చేసిన వినాయకుడి మండపాన్ని దర్శించుకున్నారు అనంతరం శ్రీ రాజస్థానీ గణేష్ యువ మిత్ర మండలి ఏర్పాటు చేసిన మండపం, లస్సీ సెంటర్లోని శివాజీ మిత్రమండలి ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం ఓల్డ్ జెడ్పీ సెంటర్ ఝాన్సీ రాణి యువసేన ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం, పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని టిడిపి యూత్ ఏర్పాటుచేసిన విజ్ఞేశ్వర విగ్రహాన్ని దర్శించుకున్నారు.అనంతరం మంత్రి నారాయణ మీడియాతో…… మాట్లాడారు ప్రజలందరికీ సకలశుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని అభిలాషించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేయాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి కోరారు. అనంతరం ప్రతి మండపం వద్ద మంత్రితో సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పిటిసి విజేత రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు..టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ రిపోర్టర్ పసుమర్తి జాలయ్య:- సింగరాయకొండ మండల ప్రజా పరిషత్ సమావేశ హాలులో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి మరియు మత్స్య…

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ, రిపోర్టర్ పసుమర్తి జాలయ్య :- సింగరాయకొండ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి పథకం అమల్లో భాగంగా, 10 రోజులపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల (సంకల్ప)లో భాగంగా పాకల గ్రామం జడ్పీహెచ్ఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    • By JALAIAH
    • September 10, 2025
    • 2 views
    సింగరాయకొండ మండలంలో అధికారులతో సమీక్షా సమావేశం

    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    పాకల జడ్పీహెచ్ఎస్‌లో మహిళాభివృద్ధి శాఖ అవగాహన కార్యక్రమం

    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    • By JALAIAH
    • September 10, 2025
    • 3 views
    మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    • By RAHEEM
    • September 10, 2025
    • 8 views
    నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 9 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ