

కర్మన్ ఘాట్, మన న్యూస్ :- కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ఓరుగంటి నరేష్ గుప్తా జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నరేష్ గుప్తాను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డే నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్ నాయక్, మద్ది చైతన్య రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొని నరేష్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.