అబద్దాలతో మసిబూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్ల పై ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతారు. సిట్టింగ్ హైకోర్టు చర్చిచే ఎంక్వయిరీ చేయించాలి.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి. జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి. ర్యాలంపాడు రిజర్వాయర్ పై ఇంకెన్ని రోజులు అబద్దాలు చెప్తారని మసిపూసి మారేడు కాయ చేసి అది చేస్తాం, ఇది చేస్తామంటూ రోజుకో అబద్దం చెబుతున్నారని ఆయన అన్నారు. గట్టు లిఫ్ట్ రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు ర్యాలంపాడు రిజర్వాయర్ కు రిపేర్లు చేస్తామని చెప్పిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ ఆరు నెలల తర్వాత వచ్చి మళ్లీ ఉత్త మాటలు చెప్పి రిపేర్లు చేస్తామంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్మాణము కేవలం రెండు టీఎంసీలకు డిజైన్ చేయబడింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు నాలుగు టీఎంసీల నీళ్లు ఆపాలన్నా, బుంగలు రిపేర్లు జరగాలన్న బండ్ మార్చాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై గతంలోనే తాము ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ అప్పటినుంచి మురళీధర్ రావు బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పుడు జరిగే అన్ని పరిణామాలపై గతంలోనే తాము స్పష్టంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 300 పేజీల నివేదిక తమ దగ్గర ఉన్నదని ఇందులో ఏ ఒక్కటి అబద్ధమాన్ని తీర్చిన తాము రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ పై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు పై నిజాలే చెప్పాను, జూరాల ప్రాజెక్టుపై ముమ్మాటికి తాను మొత్తం నిజాలే మాట్లాడడం జరిగిందని, ఎవరిని భయభ్రాంతులకు గురి చేసినందుకు మాట్లాడలేదని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లిఫ్టులు పనిచేయకపోయినా సిల్ట్ ను తొలగించామని చెప్పడం వారికే చెల్లుతుందన్నారు. స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎలాంటి పనులు చేయకుండానే ఏటా నాలుగు కోట్లు ఇస్తున్నది వాస్తవం కాదా అనే విషయాన్ని ఆఫీసర్లు, అధికార పార్టీ నాయకులు బహిర్గతం చేయాలన్నారు. రోప్ లు తెగిపోయి నాలుగు గేట్లు ద్వారా నీళ్లు కూడా వదిలేయని పరిస్థితి ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, బిజెపి సీనియర్ నాయకులు మిర్జాపురం రామచంద్రరెడ్డి, సంజీవ్ భరద్వాజ్, కృష్ణం రాజు, రఘు గౌడ్ తదితరులు ఉన్నారు..

  • Related Posts

    ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి 100 సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేదు – ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నందు మాట్లాడుతూ…. (శనివారం ) గద్వాల…

    నూతనంగా ఉద్యోగాలు సాధించిన వాల్మీకి ఉద్యోగస్తులకు శుభవార్త

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల నుండి ఎంపికైన మన వాల్మీకి ఉద్యోగస్తులకు జోగులాంబ గద్వాల జిల్లా వాల్మీకి / బోయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో తేదీ 30-06-2025…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

    పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన టిడిపి నేతలు

    పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన టిడిపి నేతలు