నర్వలో ఆయిల్ పామ్ పై రైతులకు అవగాహన సదస్సు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయిల్ పామ్ సాగు పై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని నవ్య మాట్లాడుతూ..ఆయిల్ పామ్ సాగు రైతులకు నష్టాలు లేకుండా ఆదాయాన్ని అందించగల మగ్గమైన పంట. 1993లో రూపొందించిన ఆయిల్ పామ్ చట్టం ప్రకారం రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ వివిధ సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తోంది,” అని పేర్కొన్నారు.జిల్లాకు కేటాయించిన ఆయిల్ పామ్ కంపెనీలు నర్సరీల ద్వారా మొక్కలను ఉత్పత్తి చేసి రైతులకు సరఫరా చేస్తాయని,అంతేకాక తగిన సాంకేతిక సలహాలు అందించి, పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేసి,ప్రతి నెలా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు గెలలను కొనుగోలు చేస్తాయని తెలిపారు.రైతుల ఖాతాల్లోకి అమ్మకానికి వచ్చిన డబ్బులు 14 రోజుల్లో జమచేయబడతాయని వివరించారు.NMEO-OP పథకం ప్రయోజనాలు:
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జాతీయ ఆయిల్ పామ్ అభివృద్ధి మిషన్ (NMEO-OP) పథకం కింద నాలుగేళ్లపాటు వివిధ రాయితీలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఒక్కో ఎకరానికి రూ.50,918/- వరకు ప్రోత్సాహక నిధులు అందిస్తారు. మొక్కల కొరకు రైతు ఒక్కొక్కటి ₹20 చొప్పున చెల్లించాలి.అలాగే బిందు సేద్యం పరికరాల ఏర్పాటు కోసం కూడా రైతులు కొంత వాటా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో ఉద్యాన అధికారి సుమన్,ఏఈఓ మధుసూదనరావు,ఫీల్డ్ ఆఫీసర్ హమీద్,గున్కుల్ సొసైటీ ఉపాధ్యక్షులు గొట్టం నర్సింలు,మాజీ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,హిందుస్థాన్ యూనిలీవర్ మేనేజర్ లతోపాటు గ్రామస్థులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    అబద్దాలతో మసిబూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్ల పై ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతారు. సిట్టింగ్ హైకోర్టు చర్చిచే ఎంక్వయిరీ చేయించాలి.

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి. జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి. ర్యాలంపాడు రిజర్వాయర్…

    ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి 100 సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేదు – ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నందు మాట్లాడుతూ…. (శనివారం ) గద్వాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

    లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

    పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన టిడిపి నేతలు

    పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన టిడిపి నేతలు