మెప్మా సభ్యులకు ట్యాబ్ లు పంపిణీ చేసిన – ఎమ్మెల్యే సత్యప్రభ

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి గ్రామం టిడిపి కార్యాలయంలో మెప్మా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కి ఉచిత సాంసంగ్ ట్యాబులు ప్రత్తిపాడు నియోజవర్గం శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం సేవలందించే మెప్మా సభ్యులకు ఈ టాబ్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఆర్థిక, సాంకేతిక, ఆరోగ్యం మరియు సామాజిక అభివృద్ధి సేవలను ఇకపై రిసోర్స్ పర్సన్స్ టాబ్లను వినియోగించుకుని ఆన్లైన్ ద్వారా సులభతరంగా వారి విధులను నిర్వర్తించవచ్చు అని అన్నారు. ఎస్ హెచ్ జి గ్రూపుల నిర్మాణం, ఎస్ ఎల్ ఎఫ్ గ్రూపుల నిర్మాణం, ఆధార్ సీడింగ్, బ్యాంకు లింకేజ్, స్త్రీ నిధి, వడ్డీ లేని రుణాలు వంటి వాటి నిర్వహణ కు ఈ ట్యాబులు ఉపయోగపడతాయని అన్నారు. 26 రిసోర్స్ పర్సన్స్ కి ఈ టాప్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ ఎం సత్యనారాయణ తో పాటు మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ జి సాయికుమార్, కమ్యూనిటీ ఆర్గనైజర్ పి అప్పలనాయుడు, మరియు రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.

  • Related Posts

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.…

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

    ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు