

మన న్యూస్, నెల్లూరు, జూన్ 12: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.బాధిత కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.ఈ ఘటనలో 20 మంది యువ డాక్టర్లు మరణించడం అత్యంత దురదృష్టకరమన్నారు.మృతుల కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు.
