పదో తరగతి మూల్యాంకణంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది……… పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్, తాడేపల్లి/ నెల్లూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా.. విద్యాభివృద్ధికి ఆయా ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒక దేశ భవిష్యత్తు.. విద్యార్థుల చేతుల్లోనే ఉంటుంది. యువత చదువుకొని అభివృద్ధి చెందితే.. ఆ దేశం ఆ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. అందుచేత ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న విద్యకు.. అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి , గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి కీలకమైన సంస్కరణలు చేశారని తెలిపారు. గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైయస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చి.. ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశాలు కల్పించారని తెలిపారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. రాజశేఖర్ రెడ్డి కి మించి.. విద్యావ్యవస్థలో.. విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. విద్యావ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా.. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్.. విద్యా వ్యవస్థ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకోవడం గత ఐదేళ్లలో చూసామని తెలిపారు.ఈరోజు చంద్రబాబు నాయుడు విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన నాడు నేడు పనులను.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా..ఈ ప్రభుత్వం మార్చేసిందన్నారు. ఇక విద్యార్థుల కోసం ట్యాబ్ లు, ప్రతి తరగతికి ifp ప్యానెల్ బోర్డు, RO మంచినీటి సిస్టం, ఇలా అదునాథన వసతులను పాఠశాలల్లో ప్రవేశపెడితే ఈరోజు వాటికి కనీసం మరమ్మత్తులు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అంతర్జాతీయ స్థాయికి విద్యా ప్రమాణాలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారని తెలిపారు. ఈ రోజు విద్యార్థులకు వసతులను అన్నింటినీ దూరం చేసి.. విద్యా వ్యవస్థను దుర్భర పరిస్థితిలోకి నెట్టారని తెలిపారు.ప్రతి విద్యార్థికి 10వ తరగతి.. ఎంతో ముఖ్యమని పదో తరగతి పరీక్షలు బాగా రాయాలి.. ఆ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ప్రతి విద్యార్థి ఎంతో తపన పడుతుంటారని అన్నారు. పదో తరగతి పరీక్షల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు.. ఎన్ని పనులున్నప్పటికీ విద్యార్థుల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారని అన్నారు. ఈరోజు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో.. ఎన్నో అవకతవకలకు ప్రభుత్వం తావిచ్చిందన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఇంతటి ఘోరమైన తప్పిదాలను ఎన్నడూ చూడలేదన్నారు. గంగిరెడ్డి మోక్షిత అనే విద్యార్థి సోషల్ స్టడీస్ లో 21 మార్కులతో ఫెయిల్ అయిందని.. ఆ విద్యార్థి రీవాల్యూయేషన్ కు అప్లై చేసుకుంటే..84 మార్కులు వచ్చి..మొత్తంగా 537 మార్కులు సాధించిందన్నారు నెల్లూరు కు చెందిన సాయి కుందన అనే విద్యార్థినికి.. అన్ని సబ్జెక్టుల్లో 90 పైగా మార్కులు వచ్చి.. హిందీ సబ్జెక్టులో 34 మార్కులతో ఆ విద్యార్థి ఫెయిల్ అవ్వగా.. ఆ విద్యార్థి కూడా రీవాల్యుయేషన్ అప్లై చేసుకోగా.. హిందీలో 93 మార్కులు వచ్చి..మొత్తం మీద ఆ విద్యార్థి 548 మార్కులు సాధించింది. బొర్రా సిసింద్ర రెడ్డి అనే విద్యార్థికి మ్యాథమెటిక్స్ లో 32 మార్కులు వచ్చి ఫెయిలవ గా రీవాల్యుయేషన్ అప్లై చేసుకుంటే.. ఆ విద్యార్థికి మ్యాథమెటిక్స్ లో 70 మార్కులు వచ్చేయని… మరల పేపర్ తెప్పించి రీవాల్యుయేషన్ చేయించుకుంటే.. 78 మార్కులు వచ్చాయని తెలిపారు.పేపర్ వాల్యుయేషన్ లో తప్పులు జరిగి… రీవాల్యుయేషన్లు కూడా పొరపాట్లు జరిగి.. చివరకు పేపర్ తెప్పించుకుంటే తప్ప ఆ విద్యార్థికి వాస్తవ మార్కులు రాలేదన్నారు. అలాగే వడ్డే వైష్ణవి అనే విద్యార్థికి హిందీలో 73 మార్కులు రాగా.. ఆ విద్యార్థి రీవాల్యుయేషన్ కు అప్లై చేస్తే మరల 73 మార్కులు వేశారని.. అలాగే పేపర్ తెప్పించుకొని వాల్యుయేషన్ చేయించుకుంటే..84 మార్కులు వచ్చేయన్నారు. అలాగే యోగితా, సుజనా అనే విద్యార్థులకు కూడా.. వచ్చిన మార్కులను రీవాల్యుయేషన్ లో కొన్ని మార్కులు పెరగగా.. మళ్లీ పేపర్ తెచ్చుకొని రీవాల్యువేషన్ చేయించుకుంటే ఇంకొన్ని మార్కులు యాడ్ అవడం జరిగిందన్నారు. పదవ తరగతి మూల్యాంకనంలో ఎప్పుడు ఇంత ఘోరమైన తప్పిదాలు చూడలేదన్నారు. ఈరోజు ఇలా అనేకమంది పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఫోన్సు చేస్తున్నారని .. తమ పిల్లలకు కూడా ఇలా జరిగే.. తక్కువ మార్కులు వచ్చేయన్న భావన వారందరిలో ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల తల్లిదండ్రులు ఆర్థిక భారంతో వెయ్యి రూపాయలు కట్టుకొలేక రీవాల్యుయేషన్.. చేయించుకోకుండా.. మిన్న కుండిపోయారని అన్నారు. ఈరోజు మార్కుల్లో ఇంత పెద్ద ఎత్తున.. వ్యత్యాసం కనిపిస్తుండడంతో.. వారంతా బాధపడుతున్నారని.. తమ పిల్లల మార్కులను రీవాల్యుయేషన్ కు పంపించి ఉంటే మార్క్స్..పెరిగి.. వారు మరింత స్కోర్ చేసే అవకాశం ఉండేది కదా అన్న ఆలోచన ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల్లో ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు 10వ తరగతి పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి పేపర్ ను.. రీవాల్యుయేషన్ జరిపి.. వారందరికీ న్యాయం చేసి.. వాస్తవ మార్కులను వెల్లడించాలని వైఎస్ఆర్సిపి.. డిమాండ్ చేస్తుందన్నారు. పదో తరగతి మార్కులు.. వివిధ రకాలైన ఎంట్రెన్స్ ఎగ్జామ్ లకు, ఉద్యోగాలకు కీలకం అయినందున.. తప్పకుండా రీవాల్యుయేషన్ జరిపాలన్నారు. ట్రిపుల్ ఐటి, సోషల్ వెల్ఫేర్ కళాశాలలకు సంబంధించిన ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతున్నాయని.. వాటిలో కొన్నింటికి విద్యార్థులకు 10వ తరగతి మార్కులు మెరిట్ ఆధారంగా.. ప్రవేశాలు కల్పించడం జరుగుతుందన్నారు. అలా మెరిట్ మీద.. ప్రవేశాలు కల్పించే.. విధానాన్ని పోస్ట్ పోన్ చేసి.. మళ్లీ విద్యార్థులకు రీవాల్యుయేషన్ పూర్తయిన తర్వాత.. ఆయా ఎంట్రెన్స్ ఎగ్జామ్ లకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీజీ నీట్ ఎగ్జాం కి సంబంధించి.. ఇటీవల దొర్లిన తప్పులపై కోర్టుకు వెళితే..రెండు నెలలు పోస్ట్ ఫోన్ చేసి.. విద్యార్థులకు ఆగస్ట్ లో పరీక్ష నిర్వహించాలని కోర్టులు సూచించాయని తెలిపారు.విద్యార్థికి నష్టం జరగకూడదన్న ఆలోచనతో.. కోర్టులు కూడా ఎంతో.. ముందుచూపుతో ముందుకెళ్తున్నాయన్నారు.అలాగే ఏపీలో విద్యార్థుల పట్ల ప్రభుత్వం చేసిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని.. విద్యార్థులకు రీవాల్యుయేషన్ జరిపి.. వారు ట్రిపుల్ ఐటీ, సోషల్ వెల్ఫేర్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొందే లాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.

  • Related Posts

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    మన న్యూస్, ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను అండగా ఉంటానని యువ నాయకుడు పైనేని మురళి అన్నారు. బుధవారం ఎస్ ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లోకయ్య…

    వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- మెట్ట ప్రాంత రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించిన ఘనత దివంగత నేత స్వర్గీయ వరుకుల రాజాకే చెందుతుందని రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు ( శివ) కొనియాడారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

    ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

    వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    వెన్న శివ ఆధ్వర్యంలో  వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

    జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

    జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

    డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

    సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ