నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

చివరి దశకు చేరుకున్న విఆర్సీ హై స్కూల్ ఆధునీకరణ పనులు మన న్యూస్ ,నెల్లూరు ,జూన్ 7:- వి ఆర్ హైస్కూల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన పొంగూరు షరణి – రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మహా సంకల్పంతో విఆర్ఐ స్కూల్ రూపురేఖలు మార్పు – మంత్రి లోకేష్ ఆశయం అదే – పేద విద్యార్థులకు ఇంటరాక్టివ్, డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యం పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని మహా సంకల్పంతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించిన వి ఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా సిద్దమౌతున్న పేదపిల్లల పాఠశాల వి ఆర్ హైస్కూల్ ను ఆమె పరిశీలించారు. పనుల పురోగతిని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గదికి వెళ్లి ఏర్పాటు చేసిన వసతులను, ఫర్నిచర్ ను, ప్లే గ్రౌండ్ ను పరిశీలించారు. పనులు నాణ్యవంతంగా వేగంగా చేస్తున్న ఎన్సిసి సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మాట్లాడుతూ….. వెంకటగిరి రాజా గార్ల సహాయంతో విఆర్సీని అభివృద్దిచేసారన్నారు. 1975 లో మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విఆర్సీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులను, వ్యాపార వేత్తలను , మేధావులను సమాజానికి అందించిందన్నారు. అంతటి చరిత్ర ఉన్న వీఆర్సీ హై స్కూల్ ను వైఎస్సార్సీపీ హయాంలో మూత వేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ సహకారంతో వీఆర్సీ పునః ప్రారంభానికి మా నాన్న నారాయణ సంకల్పించారని తెలియజేశారు. ఆ మేరకు ఆధునీకరణ పనుల బాధ్యత తనకు అప్పగించారని చెప్పారు. పేద విద్యార్థులకు ఇంటరాక్టివ్ , డిజిటల్ విద్యను ఈ ఏడాది నుంచి అందించబోతున్నట్లు వెల్లడించారు. ఏపీ ని డిజిటల్ ఇండియా చేయాలన్నది మంత్రి లోకేష్ బాబు ఆశయం అని తెలియజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇంటర్ నేషనల్ స్కూల్స్ లో ఉండే స్టాండర్స్ ఇక్కడ ఉంటాయని చెప్పారు. P4 కింద ఇరవై మంది విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకొంటున్నానని ప్రకటించారు. పేదపిల్లల కోసం జరుగుతున్న యజ్ఞంలో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నారాయణా విద్యాసంస్థల ఇంచార్జిలు ,ఎన్సీసీ మేనేజర్ లు పాల్గొన్నారు .

  • Related Posts

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    పుత్తూరు , మన న్యూస్, జూన్ 8: అఖిల భారత క్షత్రియ మహాసభ – 1897 యువ విభాగం జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ ను ఆంధ్రప్రదేశ్ అఖిల భారత క్షత్రియ మహాసభ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు కోనేటి…

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    మనుబోలు, నెల్లూరు జిల్లా , మన న్యూస్:  తిరుపతి జిల్లాలోని మనుబోలు మండలం లో జరిగిన లోటస్ వ్యాలీ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కుటుంబ సమేతంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    ఏబికేఎంఎస్ – 1897 జాతీయ అధ్యక్షులు మనీష్ కుమార్ సింగ్ కు ఘన సన్మానం – ఏపీ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రాజు, కోనేటి రవిరాజు లచే సత్కారం

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    విద్యారంగంలో భారీ మార్పులు – విద్యారంగాన్ని నూతన దిశగా నడిపిస్తున్న లోకేష్

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    భారీ లోడుతో తిరుగుతున్న టిప్పర్లు.. పట్టించుకోని అధికారులు…

    బక్రీద్ పండుగ వేడుకలు

    • By RAHEEM
    • June 8, 2025
    • 3 views
    బక్రీద్ పండుగ వేడుకలు

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ

    కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజితతో ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భేటీ