నెల్లూరులో చివరి దశకు చేరుకున్న విఆర్ హైస్కూల్ ఆధునికరణ పనులు

చివరి దశకు చేరుకున్న విఆర్సీ హై స్కూల్ ఆధునీకరణ పనులు మన న్యూస్ ,నెల్లూరు ,జూన్ 7:- వి ఆర్ హైస్కూల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన పొంగూరు షరణి – రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మహా సంకల్పంతో విఆర్ఐ స్కూల్ రూపురేఖలు మార్పు – మంత్రి లోకేష్ ఆశయం అదే – పేద విద్యార్థులకు ఇంటరాక్టివ్, డిజిటల్ విద్యను అందించడమే లక్ష్యం పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని మహా సంకల్పంతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సంకల్పించిన వి ఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి తెలిపారు. కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా సిద్దమౌతున్న పేదపిల్లల పాఠశాల వి ఆర్ హైస్కూల్ ను ఆమె పరిశీలించారు. పనుల పురోగతిని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి తరగతి గదికి వెళ్లి ఏర్పాటు చేసిన వసతులను, ఫర్నిచర్ ను, ప్లే గ్రౌండ్ ను పరిశీలించారు. పనులు నాణ్యవంతంగా వేగంగా చేస్తున్న ఎన్సిసి సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా పొంగూరు షరణి మాట్లాడుతూ….. వెంకటగిరి రాజా గార్ల సహాయంతో విఆర్సీని అభివృద్దిచేసారన్నారు. 1975 లో మహోన్నత ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విఆర్సీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులను, వ్యాపార వేత్తలను , మేధావులను సమాజానికి అందించిందన్నారు. అంతటి చరిత్ర ఉన్న వీఆర్సీ హై స్కూల్ ను వైఎస్సార్సీపీ హయాంలో మూత వేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ సహకారంతో వీఆర్సీ పునః ప్రారంభానికి మా నాన్న నారాయణ సంకల్పించారని తెలియజేశారు. ఆ మేరకు ఆధునీకరణ పనుల బాధ్యత తనకు అప్పగించారని చెప్పారు. పేద విద్యార్థులకు ఇంటరాక్టివ్ , డిజిటల్ విద్యను ఈ ఏడాది నుంచి అందించబోతున్నట్లు వెల్లడించారు. ఏపీ ని డిజిటల్ ఇండియా చేయాలన్నది మంత్రి లోకేష్ బాబు ఆశయం అని తెలియజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇంటర్ నేషనల్ స్కూల్స్ లో ఉండే స్టాండర్స్ ఇక్కడ ఉంటాయని చెప్పారు. P4 కింద ఇరవై మంది విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకొంటున్నానని ప్రకటించారు. పేదపిల్లల కోసం జరుగుతున్న యజ్ఞంలో భాగస్వామిని కావటం అదృష్టంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నారాయణా విద్యాసంస్థల ఇంచార్జిలు ,ఎన్సీసీ మేనేజర్ లు పాల్గొన్నారు .

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 5 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.